SREE MANNAGARA NAATIKA-10

అమ్మ చేయి పట్టుకొని ఆడుతూ-పాడుతూ సాగిపోతున్నాను.ఇంతలో అమ్మ ముఖములో ఆనందచ్చాయలు వీడి,ఆందోళన పొడచూపసాగింది.నాకే బాధనపించింపించి అమ్మనలా చూస్తుంటే.అమాయకముగా ఏంజరిగిందని అడిగాను? ఒక సారి క్రిందకు చూడమంది.చూశాను మెల్లగా.అంతే బాబోయ్ . ఎందరో గంధర్వులు-కింపురుషులు-యక్షులు-కిన్నెరులు-ఋషులు-మానవులు అమ్మ పాదాలను అందుకోవాలని ఆర్తితో ప్రయత్నిస్తున్నారు.కాని పాపం ఏదో మాయా వలయం వారిని అడ్డుకుంటున్నది.అవ్యాజ కరుణాంతరంగ అయిన అమ్మ అక్కడే నన్ను నిలబడమని వారికి తన చేతులను అందిస్తూ,పైకి చేరుస్తున్నది.అమ్మ నా ఒక్కనిదే అనుకున్న నా స్వార్థానికి ఉక్రోషం వచ్చింది.వీళ్లందరు మనతో చింతా మణి గృహమునకు వస్తారా అని అడిగాను.నన్ను చూసి అమ్మ మందహాసం చేసింది.అందులో ఏమి మహత్తు ఉందోగాని నా బుద్ధి తిరిగి ప్రచోదనము కాసాగింది.అదే నీ వొళ్ళో నేను కూర్చుందామనుకున్నాను.నువ్వు సరేనన్నావు.మరి వీళ్ళందరిని? అయోమయముగా చూసాను.అక్కున చేర్చుకొని,నన్ను ముద్దాడి,మరి నేను మీ అందరికి అమ్మను కదా! నీలాగేనే వారికి నా ఒడిలో కూర్చోవడము ఇష్టము.మీ అందరిని నా ఒడిలో లాలించము నా సహజగుణము అన్నది ఆ స్వరములో ఏ మంత్రమున్నదో గాని,మారు మాటాడకుండా అమ...