SREEMANNAGARA NAAYIKA-02

  అమ్మకు భక్తితో నమస్కరిస్తూ,
 బ్రహ్మాదులతో పాటుగ పరబ్రహ్మ దర్శనార్థము చేస్తున్న పయనపు పరవశ ఉక్కిరిబిక్కిరిలో అయోమయ ప్రాకారము దాటి,రెండవ ప్రాకారములోనికి ప్రవేశించితినన్న విషయము ఇప్పుడిప్పుడే తెలివికి వస్తున్నది ఇది నిజముగా ఏ పూర్వజన్మ పుణ్య ఫలమో కద.తల్లి అనుగ్రహముంటే అసాధ్యమేముంటుంది?

 అతి ఎత్తైన కంచులోహ ప్రాకారములు అమ్మ అపారకృపావీక్షణమునకు నిలువెత్తు నిదర్శనములు.పనస-శింశుప-దేవదారు- లవంగ-పాటల-దాడిమి-చందన మొదలైన అచ్చమైన పచ్చదనపు వృక్షాల( అసలు ఎండుటాకు కానరాదు) హరిత ప్రకాశము జగన్మాత స్థితికారకత్వము ,వాటి సుమనోహర పరిమళము వ్యాపించిన ఆశ్రిత వాత్సల్యమేమో .పరాత్పరికి ప్రణామములు చేస్తున్నవా అన్నట్లు చిలుకల-గోరువంకల మైత్రి,పావురముల ప్రశాంతత-రాజ హంసల రమణీయత పరుగుతీస్తున్న కాలమును సూచిస్తూ పరుగులు తీస్తున్న లేళ్ళు కన్నులపండుగ చేస్తుంటే,కోయిలలు-గండు తుమ్మెదలు తల్లిని కీర్తిస్తున్నట్లు కుహుకుహు రాగములతో-ఝంకారములతో స్వరములను మీటుచున్న సమయము ప్రణవమును జపిస్తూ,తరిస్తున్నటున్నది.ఎ0తటి మహద్భాగ్యము.ధన్యులమైనామనుకొని తన్మయత్వముతో దానిని దాటిన తరువాత.చదరపు ఆకారములో సప్తయోజన విస్తీర్ణ గోడలతో రాగి ప్రాకారము ప్రకాశిస్తుంటుంది.కల్పక వృక్ష వాటికలు బంగారు ఆకులతో,రతనాల పండ్లతో,వజ్రాల గింజలతో అమృత మధువును స్రవిస్తూ,పది యోజనములకు వరకు పరిమళములను వ్యాపింప చేస్తుంటాయి.గాన ప్రియులైన గంధర్వ యువతీ-యువకులు మధువును సేవిస్తూ,మదన పరవశులై ఉంటారు.అందులో పుష్ప బాణుడు పువ్వుల గొడుగు క్రింద,పువ్వుల సింహాసనముపై ,పువ్వుల మాలలను అలంకరించుకొని,తన భార్యలతో పువ్వుల మథువును త్రాగుతూ పూబంతులాడుచున్న సమయమున, వారిచెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.అమ్మ దయతో కొనసాగుతుంది.


  ( శ్రీ మాత్రే నమః.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)