AALO REMBAAVAAY-23

పాశురము-23 *********** " స్వామి సౌకుమార్యమునకు ఆతసీపుష్పములు సింహగతిని వీక్షించుచు ఆనందభాష్పములు" సర్వవాహనుడైన స్వామిని శీరియ సింహాసనారూఢినిగా మనకు దర్శింపచేస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము. అజ్ఞానము పురూరవ శాపముగా యాదవులకు సింహాసనాధిష్థత నిషేధముకదా మరి స్వామిని వచ్చి, శీరియసింహానముపై కూర్చుని వారిని అనుగ్రహించమనుచున్నారేమిటి? అని ప్రశ్నించవచ్చును. ఇక్కడ స్వామి అధిష్ఠించవలసినిది రాజ్యసింహాసనము కాదు.రాజిల్లు హృత్పద్మసింహాసనము.అదియును శీరియసింగము వలె.లక్ష్మీనారాయణులుగా. ఇరవదిమూడవ పాశురం ********************* మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం శీరియశింగం అరిఉత్తు త్తీవిళిత్తు వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పుడయ శీరియశింగాసనత్తు ఇరుందు యాం వంద కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్ "మృగానాంచ-మృగేంద్రోహం." అన్నాడు స్వయముగా పరమాత్మ- ...