KADAA TVAAM PASYAEYAM-25

కదా త్వాం పశ్యేయం-25 ********************* "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం" " వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సం మర్దనం భూభృత్ పరయటనం నమత్సుర శిర కోటీర సంఘర్షణం కర్మేద మృదులస్య తావకపద ద్వంద్వస్య కింవ ఉచితం మచ్చేతో మణిపాదుకా విహరనం శంభో సదానీంకురు." శంభో! నీవు బాలమార్కందేయుని రక్షించుటకు నీ మృదు పాదముతో కఠినమైన యముని హృదయమున తన్నినావు. అట్టి నీ మృదుపాదము నా అజ్ఞానమనే కఠినత్వమును సైతము తొలగించమని ప్రార్థించుచున్నాను.అందులకు నీ పాదపద్మములు మరింత కందిపోకుండా,నా హృదయమనే మణిపాదుకలను స్వీకరించి,నన్ను అనుగ్రహించు తండ్రీ! అని ప్రార్థించుచు,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. పిల్లలతో పాటుగా శంకరయ్య సైతము, " "అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే ఘనుడు శంకరుడు మనలను కరుణ చూచి ఏలగా నమః సోమాయ-శివాయ నమః సోమాయ -శివాయ నమ...