TANOTU NAH SIVAH SIVAM-22@SIVATANDAVASTOTRAMU
.jpg)
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ కథానుసారముగా పార్వతీపరమేశ్వరానుగ్రహమునక్సిఉ పాత్రుడైఉనకై అ రావణుడు వారికరుణమహిమయాయనునట్లుగా , మంగళాది-మంగలమధ్యాని-మంగళాంతాని అను సమొరదాయానుసారముగా జయధ్వానముతో ప్రారంభించి,మంగళ శబ్దమునుమధ్యనుంచి,శివః శబ్దముతో మంగళాంతము చేస్తూ స్తోత్ర ప్రస్తుత భాగమును ప్రారంభించాడు. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్ భుజంగ మశ్వస ద్వినిర్గ మత్క్రమ స్పురత్ కరాల ఫాల హవ్యవాట్ ధిమిధిమి ధిమీధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః అభ్ర కాలములు ఆశ్చర్యముతో కదులుతూ తీస్తున్న శ్వాసలు జయజయధ్వానములుగా స్వామికి మంగళములు కలగాలని దీవిస్తున్నాయి.దానినిగమనించిన శివుని హవ్యవాహనుడు సైతము పైకుబికి పరవశిస్తున్నాడు. ఇక్కడ కాలములను మనము కాలముగా కనుక అన్వయించుకుంటే స్వామి ప్రళయానంతర సృష్తిని సలిపి ఆ సృషికి కావలిసిన పోషనమునకు తానే విష్ణువుగా ప్రకటింపబడుతూ హరి మద్దెల సవ్వడులకు అనుకూలముగా తన తాండవమును చేస్త...