దూరీకర్తుం వాంఛసి కిం? మనీషా పంచకం-ఉపోద్ఘాతము
.jpg)
" బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనాన భళా తందనాన" పరమాత్మ తత్త్వమును ప్రపంచమునకు సులభముగా అర్థమగుటకు/ఆనందించుటకు సులభమార్గముగా అనుగ్రహించిన పరమేశ్వర లీలా విశేషమే 'మనీషా పంచకమను" స్తోత్ర రాజము. ఈ స్తోత్ర ఆవిర్భావమునకు కాశీక్షత్రము లోని మార్గము వేదికగా మారినది వాచ్యపరముగా. కాశీపంచక స్తోత్రములో తెలియచేసినట్లు శరీరమనే కాశిలో/ప్రకాశమునకు అడ్డుగా నున్న చీకట్లు తొలగించబడినవి స్తోత్ర ఫలితముగా. ద్ జీవాత్మ-పరమాత్మ సంవాదము ఏ మాత్రము వివాదములేని చిత్సత్ వివరణము. సకల జీవులకు సంకేతముగా జగద్గురువులు-సకల జీవులకు సంస్కరణముగా జగత్పాలకుల మధ్యన జరిగిన సంభాషణా చాతుర్యము. " నమశ్శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః " రుద్రనమకము. విలాసముగా వివిధరూపములను ధరించు విశ్వేశ్వరుడు , శ్వభ్యః-కుక్కలరూపముగాను, స్వపతిభ్యః-కుక్కలపాలకుని రూపముగాను,సర్వమంగళతో,నాలుగు కుక్కలను నడిపిస్తూ,క్షత్రపాలకుడైన కాలభైరవుని సంకేతిస్తూ,సాక్షాత్కరించాడు కాశీవీధుల మార్గములో. అవి బాహ్యమునకు/ఆంతర్యమునకు చాలా ఇరుకుగా కనిపిం...