దూరీకర్తుం వాంఛసి కిం? మనీషా పంచకం-ఉపోద్ఘాతము
" బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
తందనాన భళా తందనాన"
పరమాత్మ తత్త్వమును ప్రపంచమునకు సులభముగా అర్థమగుటకు/ఆనందించుటకు సులభమార్గముగా అనుగ్రహించిన పరమేశ్వర లీలా విశేషమే 'మనీషా పంచకమను" స్తోత్ర రాజము.
ఈ స్తోత్ర ఆవిర్భావమునకు కాశీక్షత్రము లోని మార్గము వేదికగా మారినది వాచ్యపరముగా.
కాశీపంచక స్తోత్రములో తెలియచేసినట్లు శరీరమనే కాశిలో/ప్రకాశమునకు అడ్డుగా నున్న చీకట్లు తొలగించబడినవి స్తోత్ర ఫలితముగా. ద్
జీవాత్మ-పరమాత్మ సంవాదము ఏ మాత్రము వివాదములేని చిత్సత్ వివరణము.
సకల జీవులకు సంకేతముగా జగద్గురువులు-సకల జీవులకు సంస్కరణముగా జగత్పాలకుల మధ్యన జరిగిన సంభాషణా చాతుర్యము.
" నమశ్శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః " రుద్రనమకము.
విలాసముగా వివిధరూపములను ధరించు విశ్వేశ్వరుడు ,
శ్వభ్యః-కుక్కలరూపముగాను,
స్వపతిభ్యః-కుక్కలపాలకుని రూపముగాను,సర్వమంగళతో,నాలుగు కుక్కలను నడిపిస్తూ,క్షత్రపాలకుడైన కాలభైరవుని సంకేతిస్తూ,సాక్షాత్కరించాడు కాశీవీధుల మార్గములో.
అవి బాహ్యమునకు/ఆంతర్యమునకు చాలా ఇరుకుగా కనిపించేవి.సూక్ష్మాతిసూక్ష్మమైన తత్త్వబోధనమునకు అనుకూలములు ఆ మార్గములు.
చందాలునిగా కర్మబంధములను దహించివేయుట వృత్తి ధర్మము.అవి భౌతికమైనవి కావచ్చును/అజ్ఞానమునకు సంబంధించినవి కావచ్చును.
జగద్గురువులు సకల శాస్త్ర పారంగతులైన తదుపరి నిత్యానుష్ఠానమునకు మార్గమునందు ప్రవేశించారు.
శంకరునికి అధ్యయనజ్ఞానము అందించిన అనుభవజ్ఞానమును పరిశీలించాలనుకున్నాడు పరమేశ్వరుడు.
"ఫాలావనమ్రత్ కిరీటం
ఫాలనేత్రార్చి షా దగ్ధ పంచేషు కీటం
శూలాహలారాతికూటం
శుద్ధమర్ధేందు చూడం" భజే మార్గబంధుం"(అప్పయ్యదీక్షితులు)ము
మార్గబంధువైన మహేశ్వరుడు మాలగా మారి,మంగళ గౌరితో నాలుగు కుక్కలతో,చర్మవస్త్రమును ధరించి,జీవుని మనసనే అడవిలో నున్న అజ్ఞానమనే మృగమును అంతర్ధానము చేయ సంకల్పించినాడు.
సందర్భము
కదాచిత-ఒకానొకప్పుడు,
కాశినగర మార్గములో జరిగినది.
సాహిత్యము
*******
శాస్త్ర గ్రంధమును సులభతరము చేయుటకు భాష్య గ్రంధమును,భాష్య గ్రంధమును మరింత సులభ తరము చేయుటకు టీకా గ్రంధమును,టీకా గ్రంధమును మరింత సులభ తరము చేయుటకు టిపటి (ఒకే మహా వాక్యమును) సహాయపడుతున్నవి.వీనిలో వివిధ అంశములు మిళితమై యుండును.అన్ని విషయములను అర్థము చేసుకొనుట సామాన్యులకు కష్టము కనుక ఒకే అంశమును మరింత సుస్పష్టము చేస్తూ,సులభతర గ్రాహ్యమును అందించునది ప్రకరణ గ్రంధము అని చెప్పబడినది.
"మనీషా పంచకమూపద్య ప్రకరన గ్రంధ విభాగమునకు చెందినది.
నాలువేదముల సారాంశము అయిన నాలుగు మహా వాక్యములు నాలుగు శ్లోకములలో సులభతరముగా చెప్పబడినవి.(నాలుగు కుక్కల సంకేతము)
అమరకోశ ప్రకారము "మనీ షా " అను శబ్దము,
ప్రజ్ఞ-శేముషి-జ్ఞప్తి-మతి-ఉపలబ్ధి-సంవిత్ (జ్ఞానము) అను అనేక అర్థములను కూడియున్నది.
స్తోత్రమును నడిపించేది గచ్చగచ్చేతి తొలగు-తొలగు అను క్రియాపదము.
అబ్రవీత్ అన్న కర్త జగద్గురువులు
అర్థము చేయించిన ఆదిదేవుడు.
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment