TURUPPAAVAI-PAASURAM-25

1.పరమాత్మతన విభూతిగా తాను సృజించిన సంసారమనే సాగర్ములో తిరుగాడుచున్న మత్స్యము.దానికికారణము సోమకుడు అను తమో-రజో గుణములు,వేదములు అనే జ్ఞానమును/సత్వగుణమును దాచివేసి,రజో-తమో ప్రవృత్తులను అధికముచేయుటయే. 2.తాను సృజించిన/తన విభూతి యైన సంసారమను పెద్ద కొండను మునగకుండా చేయుటకై,తమో-రజో గుణముల నుండి సత్వమును సంరక్షించుటకై సిద్ధపడిన సత్యస్వరూపమే కూర్మము.కల్పవృక్షము-కామధేనువు,ఐరావతము,తెల్లగుర్రము ఇలా ఎన్నో ప్రలోభములు పక్కదారిపట్టిస్తున్నప్పటికిని అమృతమే గమ్యము కనుక దానిమర్మమును చెప్పునదియే కూర్మము. 3.భూసంరక్షణమే/ఉపాధి సంరక్షణమే,"శరీరమాద్యంఖలు ధర్మసాధనం"కనుక పరమపద పథమును సూచించు ఉపాధి సంరక్షణమే వరాహావతారము. 4.నరత్వము-సింహత్వము సగముసగముగా నున్నది నారసింహము.ఇప్పటివరకు ఉపాధికి దూరముగానున్న తమో-రజో గుణములు ఉపాధిలోనే ,సత్వము సగము తరలి వచ్చినను,కదలక-మెదలకనున్నవికనుక, ఐహికమును/ఉపాధిని/తమో-రజో గ్య్ణములను హింసించి,నరత్వమును హింసించి,చైతన్యమును గమనించుటయే నారసింహము. 5.మనకు ఉన్నదనుకున్న జ్ఞానము వామనము/అసంపూర్ణము.దానిని త్రివిక్రమము చేసుకోవాలి.త్రిగుణములను జయించాలి అనిచెప్పేది ...