AALO REMBAAVAAY-19

పాశురము-19 *********** "పెరుమాళ్ళు -పిరాట్టి ఇంతవరకు ఒకరికొకరు పంచశయన మిథునమంటున్నది వారు "ఒకేఒకరు." ఆహా గోపికలదేమి భాగ్యము.ఎన్నితపముల మనలకు ఫలము.గోదమ్మ వారికి-వారితో పాటుగా నీలాకృష్ణుల శయనసౌందర్యమును దర్శింపచేస్తున్నది. చేతనులకు వారు అనవరతము మునిగితేలుచున్న సంసారములోని సింగారమును చూపిస్తు ముక్తిసోపానములను ఎక్కిస్తున్నది. అవిభక్తమైన పరమాత్మానుగ్రహమును అర్థమయ్యేటట్లుగా వారి రహస్య సన్నివేశములను సదస్యముగా వివరిస్తూ, ఆరి ఓడిలోని చేర్చుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పంచేంద్రియ తర్పణ పాశురమును అమ్మ అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్మేల్ మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్ వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్ మైత్తిడం కణ్ణిణాయ్ నీ ఉన్ మణాలనై ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్ ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్ తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్. ప్రస్తుత పాశురములో 1.ఏ...