PASURAM-18
తిరుచిట్రంబలం-పాశురము-18 **************************** అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్ కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్ తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్ విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్. ..... డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు, " పురుషునకు నాకు భేదము పోరయదెందు నరయనేకత్వమునకు హానిలేదు వాడె నేనేనె వాడను వాడొకండె ముక్తుడట్టుల గాకున్న మూఢుడతడె" ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు పరమాత్మ ప్రక్షిత-నిక్షిత స్వేఛ్చాలీలను విశదపరుస్తున్నారు. కావున, పెణ్ణే! నిన్రాన్ కళల్ పాడి అని అంటున్నారు. సామాన్యార్థమును కనుక మనము భావించుకుంటే, నిన్రాన్-నిలబడి స్వామి కళల్ పాడి-పాదపద్మములను సంకీర్తించుట. కాని ఇక్కడ మనకు అందవలసిన సందేశము మన శరీరము నిలబడి అని కాదు. ఇక్కడ మనము నిలబెట్టవలసినది మన మనసును.త్రికరణశుధ్ధిని/ఏకాగ్రతను. అన్నా మలయన్-అన్...