దూరీకర్తుం వాంఛసికిం-మనీష-04
.jpg)
చీమలో-బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమమీర తెలుసుకుంటే--అన్నారు త్యాగరాజు. ఈ విషయమునే మనీషా పంచకము, " యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు" అనికీర్తిస్తున్నది. ఒకవిధముగా ఈ వివరనము "అహం బ్రహ్మాస్మి"అను మహావాక్య వివరనముగాను భావించవచ్చును.సూక్ష్మ-స్థూల ఉపాధిలో నిక్షిప్తముగా నుండి/సాక్షీభూతముగా నున్న పరమాత్మ ఏ విధముగా అహం నే-నాది-నావలన-నానుండి అను పరిమిత భావనను తొలగించుకొనిన అంతయు బ్రహ్మ+అస్మి= బ్రహ్మమై యుండును.అంతే అపరిమితము నుండి పరిమితమును తొలగించుకొనగలుగుట; నేను ఎవరు? అన్న పేశ్నకు శరీరము+ మనసు+ఆత్మ సమాధానమనుకొనినప్పుడు దాని నుండి కాలపరిమితమైన-కాలముతో పాటుగా పరిణామములను చెందుచున్న శరీరమును లెక్కించ నప్పుడుమిగిలిన ,మిగిలిన కాలమునకులొంగని/మార్పుచెందని/నామరూపములు లేని చైతన్యమే-"బ్రహ్మము." ఉదాహరణమునకు మనము వెలుతురులో మన శరీరమును పూర్తిగా చూసుకొనగలము.కాని చీకటిలో సైతము మన శరీరము అదేవిధముగా ఉంటుంది అన్న భావనను కోల్పోము దానిని మనము సరిగా చూడలేకపోయినప్పటికిని.దానికి కారనము అనుభవ జ్ఞానము.ఆ అనుభవజ్ఞానమే "మనీష" ...