దూరీకర్తుం వాంఛసి కిం-04
' జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫురుతరా యా సంవితుజ్జన్యంబతే
యా బ్రహ్మాది పిపీలికాంత తనుషుప్రోత్సా జగత్సాక్షిణి
సైవాహం (స+ఏవ+అహం) న చ దృశ్యవస్త్వితి 'దృఢప్రజ్ఞాపీయస్యాస్తి చేత్
చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇతి "ఏషా మనీషా మమ"
ఆదిసంకరులు ఎవరు గురువో తెలియచేస్తూ అన్నమయాత్ అన్నమయం శ్లోకములో కదలలేని జడ శరీరము గురించి-కదులుటకు వీలులేనంతగ సర్వమును వ్యాపించియున్న చైతన్యమును గురించి తెలియచేసినారు.
ప్రస్తుత శ్లోకములో బ్రహ్మము మొదలు చీమ వరకు అంతర్యామిగా నుండినప్పటికిని,వాటి మూడు అవస్థలతో ఏ మాత్రము ప్రభావితముకాని పరమాత్మ ప్రకాశమును కీర్తిస్తున్నారు.
పద విభజనము
సం విత్ జృంభతే-జాగృత్-స్వప్న-సుషుప్తి
సం విత్-యా -ప్రోతా-బ్రహ్మ-ఆది-పిపీలికాంత-తనుషు
సాక్షిణీ (అయినప్పటికినీ)
స ఏవ యో-వస్తు ఇతి న చ దృశ్య
అపి దృద్థ ప్రజ్ఞ న చ దృశ్య
వస్తు ఇతి (వస్తువుగా ఎంత ప్రజ్ఞావంతునికైనను కానరానిది)
యంప్రోతా-అది మనలోవిడదీయరానిదిగా ఉన్నప్పటికిని
వస్తుఇతి న చ దృశ్యా-వస్తువు వలె కానరానిది.(అవిభాజ్యము)
కాని
అస్తిచేత్-అది చైతన్యముగా నున్నది.
సర్వం శివమయం జగత్
ఏకబిల్వం శివార్పణం.
Comments
Post a Comment