AALO REMBAAVAAY-01 PASURAM

పాశురం-01 ఆండాళ్ తల్లికి, ఆచార్యులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంత మేర, మొదటి పాశురమును అనుసంధానము చేసుకుందాము.అమ్మ చెప్పినట్లు నారాయణనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నమక్కే మనకే తప్పక పరతరువాయ్-పరను అనుగ్రహిస్తాడు అన్న అమ్మ మాటకు భక్తి యే అర్హతగా స్వామిని అడిగే అధికారముగా భావిస్తూ, మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్ నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్ శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్ కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపకుమరన్ ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై దరువాన్ పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ********************** మొదటి పాశురములో యశోదనందుల పుత్రునిగా స్వామి బాలకృష్ణుని అర్చారూపముతో పాటు ,నారాయణుని పర స్వరూపమును తెలియచేస్తూ, శుభసమయమునందు సామూహికముగా గోపికలందరు నోమును నోచుకొనుటకు సంకల్పము-సంసిద్ధము-సానుకూలతను తెలుపుతున్నది.వ్రతఫలితముగా స...