NAH PRAYACHCHAMTISAUKHYAM-25

నః ప్రయచ్చంతి సౌఖ్యం-25 *********************** భగవంతుడు-భక్తుడు ఇద్దరు పండితులే " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ." వైదిక మంత్రములందును వర్దాంతసారమునందున్న మేథా దక్షిణామూరితి తత్త్వమైన రుద్రునకు నమస్కారములు. " ఓం అక్షరాయ నమః-ఆద్యంతరహితాయ నమః. తిరుమురుక్కరు పాలై రచయిత మధుర తముళ కవి నక్కీరర్ నమ్మినసత్యమునకు నిలిచిన,పరమేశ్వరునే చర్చకు రప్పించెను తివిలై యడయల్ తెలియగ రానివి దేవుని-జీవుని ఆటలు ఆటకు నాందియైనది అమ్మ ఘనపూంగదై పరిమళ సందేహము పరిష్కారమునకై పసందుగ రాజుచే ప్రకటనము బహుమానము పరమేశుడు రాసిన పద్యము ప్రవేశించినది ధారుమి చదువగ నక్కీరుడు పట్టిన దోషము, నడిపించెను శివుని సభకు చర్చకు అతి మూర్ఖత్వమె ఆదిదేవుని అనుగ్రహమునకు కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. " ఆపాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాందమావిస్పురత్ జ్యోతిః స్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః అస్తోకాప్లుతమకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సితసి...