AALO REMBAVAY-04
.jpg)
నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ********************* గోకులములోని వారందరు తాము వింటున్నది-కంటున్నది-అంటున్నది కృష్ణునినే తక్క అన్యము కాదని భావించు భాగ్యశాలురు.వారి సమయము-సంభాషణము-సమస్తము శ్రీకృష్ణుడే.వారెవరిని తలచుకొనినా-కలుసుకొనినా-పిలుచుకొనినా వారి సంబోధనము మాత్రము ఒక్కటే.అదే, కణ్ణా! గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ పంచాయుధములను-పంచభూతములను-పంచేంద్రియములను సమన్వయపరుస్తూ,ప్రళయానంతరమున ప్రకటింపబడిన, పద్మనాభస్వామిని వరుణదేవునిగా ప్రార్థిస్తున్నది. భావములోన-బాహ్యమునందున గోవింద గోవింద అన్నది వారి జీవనము. నిత్యకర్మానుష్ఠానమునకు/మార్గళి స్నానమునకు కావలిసిన జలములను పుష్కలము నిమ్మని వారు స్వామిని వేడుకుంటున్నారు. మగిళిందు మార్గళి నీరాడ మనస్ప...