KADAA TVAAM PASYAEYAM-19

కదా త్వాంపశ్యేయం-19 ******************** "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం" " ఏకో వారిజబాంధవో క్షితి-నభోవ్యాప్తం తమోమండలం భిత్వా లోచక గోచరోపి భవతి త్వం కోటిసూర్య ప్రభోః వేద్యః కిం న భవస్యహో ఘవతరం కీ దృక్ భవేత్నత్నమః తత్ సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ." మహాదేవ నీవు మా ప్రభువువు,నీ అనంతకోటి సూర్యకాంతులతో సమస్త చీకటులను తరిమివేయుచున్నావు.నా అంతరంగమును నందలి చీకటిని/అజ్ఞానమును పారద్రోలి నన్ను అనుగ్రహింపుము అని మనసారా ప్రార్థిస్తూ, ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము. "హర హర మహాదేవ శంభో" " జయ జయ శంకర-హరహర శంకర జయజయ శంకర-హరహర శంకర జయజయ శంకర-హరహర శంకర హరహర శంకర-జయజయ శంకర" నాదం తనుమనిశం శంకరం_ఎటుచూసినా ఈశ్వరనామస్మరణమే, ఆ కోలాహలములో కోర్కెలు కోరుకునేవారు,తీరినకోరికలు కలవారు,నిత్యానుష్ఠానపరులు,నిమిత్త...