Posts

Showing posts from March 4, 2025

ASYA ASTI ITI KASI@ KASI PAMCHAKAM-01

Image
 " మనో నివృత్తిః పరమోపశాంతిః సా తీర్థవర్యా మణికర్ణికాచ    జ్ఞాన ప్రవాహా విమలాది గంగా సా కాశీకాచ నిజబోధరూపా"    పదవిభజనము    మనోనివృత్తి-పరమ-ఉపశాంతి-సా-తీర్థవర్యా-మణికర్ణికాచ-జ్ఞానప్రవాహ-విమలాది గంగా-నిజబోధ రూపాచ-సా కాశికా.      సా-దేనినైతే ఇది అని వర్ణించలేమో/ఏదైతే నామరూపములు లేనిదానిగా    కాశికా-కాశ/ప్రకాశ స్వభావముతో నున్నదో     అది- ఆ మూలపదార్థము  నిజబోధ రూపా-తన గురించి మన బుద్ధికి తెలియచేసే స్వభావముతో ఉన్నది.  ప్రకాశము దాని రూపము  ప్రబోధము దానిలక్షణము.ప్రవాహ రూపముగా  ప్రకటనమగుచు జ్ఞానమును  ప్రబోధనము  చేయుట దాని  ప్రత్యేకత. చూడగలిగిన ఒక పుణ్య   క్షేత్రము  చూపిస్తూ అందులో సాక్షిగా నున్న మూలపదార్థమును దర్శింపచేయుట దాని ధ్యేయము.     ఆ బోధనము ఐదు ప్రయోజనములను జీవులకు కలిగిస్తున్నది.  1.మనో నివృత్తి  2.ఉపశమనము  3.మణికర్ణిక గట్టు పరిచయము  4.ఉపశమనము  5.ఆత్మబోధనము.         బాహ్యమునకు కాశీపట్తనము మానసిక అలజడులను తగ్గిస్తు...

ASYA ASTI ITI KAASI @ KAASI PAMCHAKAM

Image
     ఓం నమః శివాయ   **********  " దేహో దేవాలయః ప్రోక్తో సనాతనః    త్యజేద జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్"          (లక్ష్మీనారయణ సంహిత)    ఇదే వ్షయమును సులభశైలిలో కాశిపట్టనముతో పోలుస్తూ,పుణ్యక్షత్రముగా/పరమాత్మ నివాసముగా సమీక్షిస్తూ, జగద్గురు  ఆదిశంకరులు "కాశీ పంచకము" అను శీర్షికతో మనలను అనుగ్రహించారు.    ప్ర+ఉక్తః-ప్రకృష్టముగా చెప్పుచున్నది    సనాతనము ఏమని?   సః+అహం -పరమాత్మగానేనే నీదేహములోఉన్నాను అన్న సత్యమును.ఆవిషయం అర్థమయితేనే జీవుడు సోహం/అద్వైత భావముతో పరమాత్మను గమనించగలడు/దర్శించగలడు/సంస్కరింపబడగలడు.    కాని ఆ స్థితిని చేరనీయకుండా ఒక అవరోధము,అదే  దేహమేనేను అన్న భ్రాంతి హృదయము నిండా యుండి,  నేను దేహము కాదు-నాలో దాగి యున్న పరమాత్మయే నేను అన్న భావన కలగాలంటే ,ఏమి చేయాలో కూడా చెబుతోంది శ్లోకము.    నీ మనసులోఇన్నాళ్ళు నిలిచియున్న భావనలనే అజ్ఞానమును  త్యజేద-విడిచిపెట్టు.తత్ఫలితముగా క్నానము,ప్రకాశము,దైవము నీకు దర్శనమిస్తుంది.   ఐదు శ్లోకములతో ఆవిషకర...

FALASRUTI@ SIVATANDAVA STOTRAMU@ SIVATANDAVASTOTRAMU

Image
     స్తోత్ర పథనము-స్మరణము-లేఖనము అసేషఫలప్రదము.  "శివతాండ స్తోత్రము" అందులకు మినహాయింపు కాదు.   నర్మగర్భముగా దశవక్త్రగీతం అని ప్రస్తావించారు.పది ఇంద్రియముల ప్రార్థనమే పది నాలుకల ప్రార్థనము.  ఇంద్రియములను జయించినవారలు ఈ "శివతాందవ స్తోత్రము"ను పఠించిన/ధ్యానించిన వారికి "స్థిరముగా" రథములు-గజములు-తురగములు కూడియున్న లక్ష్మీదేవి సుముఖత్వముతో బహుప్రీతితో శంభుని ఆనగా దదాతి -ఇస్తుంది-ప్ర దదాతి-విశేషముగా ఇస్తుంది.  ఇది కథను అనుసరించి.      ఛందస్సు గురించి ఒక్క సారిప్రస్తావించుకుందాము.అతిముఖ్యమైన  "పంచ చామరవృత్తము"పదహారు అక్షరములు"పదహారుకళలు.పదహారు ఉపచారములు."  ఒక లఘువు+ఒక గురువు   శివశక్తులు-జీవుడు+దేవుడు+ వరము+ప్రదానము  పునరపి+పునరావృత్తి రహితము.    ఆ గురులఘువులలోని ఆంతర్యము.  ఇక్కడ స్థిరనివాసము చేసుకొన వలసిన గుఋఋఅములు-ఏనుగులు-రథము మనముచూసేవి కాదు.ఇవిసంకేతములు.ఇదేవిషయము "శ్రీసూక్తము"లో సైతము ప్రస్తావించబడినది.  "అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం" అంటూ.    స్థిరముగా మనహృదయమనే రథములో లక్...