FALASRUTI@ SIVATANDAVA STOTRAMU@ SIVATANDAVASTOTRAMU
స్తోత్ర పథనము-స్మరణము-లేఖనము అసేషఫలప్రదము.
"శివతాండ స్తోత్రము" అందులకు మినహాయింపు కాదు.
నర్మగర్భముగా దశవక్త్రగీతం అని ప్రస్తావించారు.పది ఇంద్రియముల ప్రార్థనమే పది నాలుకల ప్రార్థనము.
ఇంద్రియములను జయించినవారలు ఈ "శివతాందవ స్తోత్రము"ను పఠించిన/ధ్యానించిన వారికి "స్థిరముగా" రథములు-గజములు-తురగములు కూడియున్న లక్ష్మీదేవి సుముఖత్వముతో బహుప్రీతితో శంభుని ఆనగా దదాతి -ఇస్తుంది-ప్ర దదాతి-విశేషముగా ఇస్తుంది.
ఇది కథను అనుసరించి.
ఛందస్సు గురించి ఒక్క సారిప్రస్తావించుకుందాము.అతిముఖ్యమైన
"పంచ చామరవృత్తము"పదహారు అక్షరములు"పదహారుకళలు.పదహారు ఉపచారములు."
ఒక లఘువు+ఒక గురువు
శివశక్తులు-జీవుడు+దేవుడు+ వరము+ప్రదానము
పునరపి+పునరావృత్తి రహితము.
ఆ గురులఘువులలోని ఆంతర్యము.
ఇక్కడ స్థిరనివాసము చేసుకొన వలసిన గుఋఋఅములు-ఏనుగులు-రథము మనముచూసేవి కాదు.ఇవిసంకేతములు.ఇదేవిషయము "శ్రీసూక్తము"లో సైతము ప్రస్తావించబడినది.
"అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం" అంటూ.
స్థిరముగా మనహృదయమనే రథములో లక్ష్మీదేవి ఆసీనురాలవటానికి,ఆ రథమునకు ముందరివైపున మనసులోని చంచలభావముల స్థానమున కేవలము గమ్యమును మాత్రమేచేర్చగల ధృఢ నిశ్చయమున్న అతు-ఉటు చూడకుండ నడిచే గుర్రములు కట్టబడి యుండాలి.ఆ ఏకాగ్రతను మరింత పెంపొందించుటకు ఆ రథము వెనుక భాగమున ప్రణవమును ఘీంకరిస్తున్న ఏనుగులు కావాలి.
అంటే
అశ్వములు-మనస్సు
ఏనుగులు-వాక్కు
రథము-కర్మలు/పనులు
మనోవాక్కాయకర్మలు అను త్రికరణములు స్థిరమై జీవుని హృదయమును లక్ష్మీ స్థిరనివాసము చేయించగలుట స్తోత్ర ఫలితము.
ఏమానందము భూమీతలమున
శివతాండవమట-శివ లాస్యంబట
జయమంగళం-నిత్య శుభమంగళం.
Comments
Post a Comment