FALASRUTI@ SIVATANDAVA STOTRAMU@ SIVATANDAVASTOTRAMU

 


   స్తోత్ర పథనము-స్మరణము-లేఖనము అసేషఫలప్రదము.

 "శివతాండ స్తోత్రము" అందులకు మినహాయింపు కాదు.

  నర్మగర్భముగా దశవక్త్రగీతం అని ప్రస్తావించారు.పది ఇంద్రియముల ప్రార్థనమే పది నాలుకల ప్రార్థనము.

 ఇంద్రియములను జయించినవారలు ఈ "శివతాందవ స్తోత్రము"ను పఠించిన/ధ్యానించిన వారికి "స్థిరముగా" రథములు-గజములు-తురగములు కూడియున్న లక్ష్మీదేవి సుముఖత్వముతో బహుప్రీతితో శంభుని ఆనగా దదాతి -ఇస్తుంది-ప్ర దదాతి-విశేషముగా ఇస్తుంది.

 ఇది కథను అనుసరించి.

 

   ఛందస్సు గురించి ఒక్క సారిప్రస్తావించుకుందాము.అతిముఖ్యమైన

 "పంచ చామరవృత్తము"పదహారు అక్షరములు"పదహారుకళలు.పదహారు ఉపచారములు."

 ఒక లఘువు+ఒక గురువు 

 శివశక్తులు-జీవుడు+దేవుడు+ వరము+ప్రదానము

 పునరపి+పునరావృత్తి రహితము.

   ఆ గురులఘువులలోని ఆంతర్యము.


 ఇక్కడ స్థిరనివాసము చేసుకొన వలసిన గుఋఋఅములు-ఏనుగులు-రథము మనముచూసేవి కాదు.ఇవిసంకేతములు.ఇదేవిషయము "శ్రీసూక్తము"లో సైతము ప్రస్తావించబడినది.

 "అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం" అంటూ.


   స్థిరముగా మనహృదయమనే రథములో లక్ష్మీదేవి ఆసీనురాలవటానికి,ఆ రథమునకు ముందరివైపున మనసులోని చంచలభావముల స్థానమున కేవలము గమ్యమును మాత్రమేచేర్చగల ధృఢ నిశ్చయమున్న అతు-ఉటు చూడకుండ నడిచే గుర్రములు కట్టబడి యుండాలి.ఆ ఏకాగ్రతను మరింత పెంపొందించుటకు ఆ రథము వెనుక భాగమున ప్రణవమును ఘీంకరిస్తున్న ఏనుగులు కావాలి.

  అంటే

 అశ్వములు-మనస్సు

 ఏనుగులు-వాక్కు

 రథము-కర్మలు/పనులు

  మనోవాక్కాయకర్మలు అను త్రికరణములు స్థిరమై జీవుని హృదయమును లక్ష్మీ స్థిరనివాసము చేయించగలుట స్తోత్ర ఫలితము.

  ఏమానందము భూమీతలమున

  శివతాండవమట-శివ లాస్యంబట

   జయమంగళం-నిత్య శుభమంగళం.


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)