ASYA ASTI ITI KAASI @ KAASI PAMCHAKAM
ఓం నమః శివాయ
**********
" దేహో దేవాలయః ప్రోక్తో సనాతనః
త్యజేద జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్"
(లక్ష్మీనారయణ సంహిత)
ఇదే వ్షయమును సులభశైలిలో కాశిపట్టనముతో పోలుస్తూ,పుణ్యక్షత్రముగా/పరమాత్మ నివాసముగా సమీక్షిస్తూ,
జగద్గురు ఆదిశంకరులు "కాశీ పంచకము" అను శీర్షికతో మనలను అనుగ్రహించారు.
ప్ర+ఉక్తః-ప్రకృష్టముగా చెప్పుచున్నది
సనాతనము ఏమని?
సః+అహం -పరమాత్మగానేనే నీదేహములోఉన్నాను అన్న సత్యమును.ఆవిషయం అర్థమయితేనే జీవుడు సోహం/అద్వైత భావముతో పరమాత్మను గమనించగలడు/దర్శించగలడు/సంస్కరింపబడగలడు.
కాని ఆ స్థితిని చేరనీయకుండా ఒక అవరోధము,అదే
దేహమేనేను అన్న భ్రాంతి హృదయము నిండా యుండి,
నేను దేహము కాదు-నాలో దాగి యున్న పరమాత్మయే నేను అన్న భావన కలగాలంటే ,ఏమి చేయాలో కూడా చెబుతోంది శ్లోకము.
నీ మనసులోఇన్నాళ్ళు నిలిచియున్న భావనలనే అజ్ఞానమును
త్యజేద-విడిచిపెట్టు.తత్ఫలితముగా క్నానము,ప్రకాశము,దైవము నీకు దర్శనమిస్తుంది.
ఐదు శ్లోకములతో ఆవిషకరీంచారు ఆదిశంకరులు .వానికిఉదాహరణలుగా,
1.మణికర్ణికా ఘట్టము
2.ఇంద్రజాలము
3.పంచకోశములు
4.జ్ఞానగంగ ప్రవాహము/అమ్మవారు
5.తురీయ స్త్థితి
అను ఐదు అంశములను వివరించారు.
కథా పరముగా క్షత్రదర్శనమును చేసిన వారందరికి ఇవి పరచితమే.
కాశి పంచకంకేవలము క్షే త్ర దర్శనము మాత్రమేకాదు.కైవల్య దర్శనము.
ఆవిశేషమును జనబాహుళ్యములోనికి అందించి సార్థకతను కలిగించుటయే "
" సకాశికాహం నిజబోధరూపా"
ఏక బిల్వం శివార్పణం
Comments
Post a Comment