ASYA ASTI ITI KAASI @ KAASI PAMCHAKAM

  
  ఓం నమః శివాయ
  **********
 " దేహో దేవాలయః ప్రోక్తో సనాతనః
   త్యజేద జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్"

         (లక్ష్మీనారయణ సంహిత)
   ఇదే వ్షయమును సులభశైలిలో కాశిపట్టనముతో పోలుస్తూ,పుణ్యక్షత్రముగా/పరమాత్మ నివాసముగా సమీక్షిస్తూ,
జగద్గురు  ఆదిశంకరులు "కాశీ పంచకము" అను శీర్షికతో మనలను అనుగ్రహించారు.

   ప్ర+ఉక్తః-ప్రకృష్టముగా చెప్పుచున్నది
   సనాతనము ఏమని?
  సః+అహం -పరమాత్మగానేనే నీదేహములోఉన్నాను అన్న సత్యమును.ఆవిషయం అర్థమయితేనే జీవుడు సోహం/అద్వైత భావముతో పరమాత్మను గమనించగలడు/దర్శించగలడు/సంస్కరింపబడగలడు.
   కాని ఆ స్థితిని చేరనీయకుండా ఒక అవరోధము,అదే
 దేహమేనేను అన్న భ్రాంతి హృదయము నిండా యుండి,
 నేను దేహము కాదు-నాలో దాగి యున్న పరమాత్మయే నేను అన్న భావన కలగాలంటే ,ఏమి చేయాలో కూడా చెబుతోంది శ్లోకము.
   నీ మనసులోఇన్నాళ్ళు నిలిచియున్న భావనలనే అజ్ఞానమును
 త్యజేద-విడిచిపెట్టు.తత్ఫలితముగా క్నానము,ప్రకాశము,దైవము నీకు దర్శనమిస్తుంది.
  ఐదు శ్లోకములతో ఆవిషకరీంచారు ఆదిశంకరులు .వానికిఉదాహరణలుగా,
1.మణికర్ణికా ఘట్టము
2.ఇంద్రజాలము
3.పంచకోశములు
4.జ్ఞానగంగ ప్రవాహము/అమ్మవారు
5.తురీయ స్త్థితి
   అను ఐదు అంశములను వివరించారు.
  కథా పరముగా క్షత్రదర్శనమును చేసిన వారందరికి ఇవి పరచితమే.
  కాశి పంచకంకేవలము క్షే త్ర దర్శనము మాత్రమేకాదు.కైవల్య దర్శనము.
  ఆవిశేషమును జనబాహుళ్యములోనికి అందించి సార్థకతను కలిగించుటయే " 
 " సకాశికాహం నిజబోధరూపా"
    ఏక బిల్వం శివార్పణం

 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)