Posts

Showing posts from April 9, 2019

NA: PRAYACHCHAMTI SAUKHYAM-05

Image
 నః ప్రయచ్చంతి  సౌఖ్యం-08  ************************* " గో" శబ్దమునకు పవిత్రము-ధర్మము అను అర్థములను పెద్దలు చెబుతారు.ధర్మమును రక్షించు పరమేశ్వరుని గోపాలునిగా,ధర్మ సంరక్షకునిగా భావిస్తే ,శివుడు-శివుని కొలిచే భక్తులు గోపబాలురే కదా.శివోహం.  కార్తిక సోమవార శుభకామనలతో నేటి కథను ప్రారంభిద్దాము పరమేశ్వరానుగ్రముతో.  భగవంతుడు-భక్తులు ఇద్దరు గోపబాలురే  " నమః శంగాయచ-పశుపతయే నమో నమః"   "శం" అనగా సృష్టించి,సృష్టించిన దానియందు జీవులకు తాదాత్మ్యమును కలిగించి,అన్యము ఏదియును లేదనిపించి,ఆత్మార్పణను చేయించే శక్తి.ఆ శక్తియే " ఈశ్వర చైతన్యము." నమోవాకములు.   సస్వరూపమును తెలిసికొనలేని జీవులు పశువులు.వారిని పాలించే ఏకైక నాయకుడు పశుపతి.ఓం పశూనాం పతయే నమః."  పశుపాలకులు ఈశ్వరతత్త్వమును గ్రహించిన ధన్యులు.కనుకనే వారు పశువుల కొట్టములో పశుపతిని దర్శించగలిగారు." ఓం నమో గోష్ఠాయచ."వారికా దివ్యత్వము లభించుటకుకారణము రుద్రుడే సుమా.ఇది చదివితే కాదనగలరా?  సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం.   " ఉతైనం గోపా అదృశ నదృశ నుదాహార్యః" తన కిరణముల...