MUDAVA MAJILEE-SARVA SAMKSHOBHANA CHAKRAMU AMTE?

"అష్టదలకమలమందు నిష్టతో నీ ప్రతిమనిలిపి అర్ష్టికర్తవనుచు నీదు చరనములనే నమ్మితిని పరమేశ్వరి నీకిదిగో వందనం" స్థూలదేహముతో త్రైలోక్యమోహన చక్రమనే మూడుగీతలు కలిగిన ప్రాకారములోనికిప్రవేశించిన ప్రయాణికుడు అక్కడ సిద్ధిమాతల-సప్తమాతృకల-ఉద్రాశక్తుల సహాయముతో చక్రేశ్వరి ఆశీర్వచనముతో ఒకమెట్టిపైకెక్కి సర్వాశాపరిపూరక చక్రమను పేరుతో నున్న పదహార్రు వికసిత దళములతో వృత్తాకారముగానున్న ఆవరనములోనికి ప్రవేశించి పదహారు అద్భుత శక్తిమాతల,సిద్ధిమాత,ముద్రామాత సహాయముతో స్వప్నావస్థను మనసుతో ల్కలిసిన సూక్ష్మ శరీరముతో అనుభవించి తాత్కాలికమైన ఆనందమునకు లొంగక అణిమలోని మహత్తును,లఘిమలోని పటుత్వమును అర్థముచేసుకుని,చక్రేశ్వరి దీవెనతో మూడవ ఆవరణమైన "సర్వ సంక్షోభణ చక్రమను"పేరుగల మూడవ ఆవరనము లోనికి ప్రవేశిస్తున్నాడు.మహిమా సిద్ధిమాత-సర్వాకర్షన ముద్ర మాత సహాయమునకై తోడుగా ఉన్నారు.ముద్రాసక్తి న్యాసమును తెలియచేయుటతో పాటుగా,సందేహములను సైతము తొలగిస్తున్నది. స్వప్నములకు ఇక్కడ చోటు లేదు.ఊహలు ఊసులాదవు. ప్రయాణికుడు విశ్వ-తేజదశలను దాటి ప్రాజ్ఞుడవుతున్నాడు.అంటే జ్ఞానమును పరిచయముచేసుకు...