SIVATANDAVASTOTRAM(EKA SILPI TRILOECHANAE MATIRMAMA)-07.
.jpg)
కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల- ద్ధనంజయాధరీ/ హృతీ కృతప్రచండపంచసాయకే | ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక- -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 || భాషాపరముగా గమనిస్తే ప్రస్తుత శ్లోకములో రెండు విరుద్ధ విషయములు త్రిలోచనుడు చేసినట్లు కీర్తించబడ్డాయి. మొదటిది తన మూదవకన్నును యజ్ఞవేదికచేసి తాను ధనంజయుడై/అగ్నిరూపుడై పంచశరములవానిని/మన్మథుని యజ్ఞపురుషునకు హవిస్సుగా అర్పించునాడు.అంటే కాముని దహించివేసినాడు. రెండవది తన మూడవకన్నును కామప్రకోపితమైన అమ్మవారి వక్షస్థలమును వస్త్రము చేసి తన మనసును కుంచె చేసి తానొక అసమాన శిల్పియై మకరికాపత్ర రచనను చేసినాడు. అట్టి విరుద్ధస్వభావములు కల స్వామి త్రిలోచనునిపై నా మనసు లగ్నమై యుండునుగాక అనునది శ్లోక భావము. సాధకుని దృష్టిలో కాముని దహించినది-కామిని కుచములను సింగారించినది ఒకేఒక లోకాతీత శక్తి. దానికి ఇంద్రియ లౌల్యము లేదు.సమ్హారము అను పేర అది జీవుని సంస్కరించి తిరిగి పంచకృత్యములను ప్రారంభించినది. నిజమునకు మన్మథుడు చావలేదు.అహమును తొలగించుకుని,అనంగుడై తన కర్తవ్యమును నెరవేర్చుచున్నా...