NA RUDRO RUDRAMARCHAYAET-INTRODUCTION. (SIVAANAMDALAHARI)

పరమపావనమైన పార్వతీపరమేశ్వర తత్త్వమును ప్రసాదించిన,శ్రీశైలక్షేత్రమునజగద్గురువులైన శ్రీ శంకరభగవత్పాదుల చే ప్రస్తావించబడిన "శివానంద-లహరి స్తోత్రమును" పరిచయము చేసుకునే ప్రయత్నము ఇది.అనందము అదియును అనవరతము.దేనిగురించి తెలుసుకునే ప్రయత్నము లో సంభవించుచున్నది,దేని అనుగ్రహముగా కటాక్షించుచున్నది అన్న సందేహమునకు "పరస్పర తపః ఫలాభ్యాం" అంటున్నారు ఆదిశంకరులు. తపము వలన లభించిన ఫలము ఎంతవరకు వ్యాపిస్తున్నది అనుకుంటే "అస్తోకాం" అంటున్నారు. నిశ్శేషముగా/సంపూర్ణముగా సమస్తమును అనుగ్రహిస్తుంది అంటున్నారు. సంపూర్ణముగా మాత్రమే కాదు పునః భవాబ్యాం-అంటున్నారు ఒక్కసారి మాత్రమే కాదు పునః పునః తిరిగి/తిరిగి నిరంతరము అనుగ్రహిస్తూనే ఉంటుందట. ఆ కరుణనే మనము ప్రేమతో శివాభ్యాం అంటున్నాము. అంటే శివ-పార్వతి రూపములో నున్న ప్రకృతి-పురుషులు. వారి స్మరనము వలన మనకు "ఆనంద స్పురణము అనుభవాభ్యాం" ఆనందము అనుభవములోనికి వస్తుంది.మనము దానిని ఆస్వాదిస్తూనే ఉంటామట. ఇంకెందుకు ఆలస్యము? కొంతైన ఆవిష్కరించుకోవటానికి వారి అనుగ్రహముతో. సర్వం శివాభ్యాం .పాదార్ప...