పరమపావనమైన నీపాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము ఉండి,పోవునవి యేగ మానవ నాలుగుదశలు ఉండి,పోవునవి యేగ మనిషి కోపతాపములు ఉండి,పోవునవి యేగ ఋతువులు ఏడాదిలో ఉండి,పోవు వారేగా రవిచంద్రులు దినములో ఉండి,పోవునవి యేగ మంచి చెడులు మనుగడలో ఉండి,పోవునవి యేగ ఆకలిదప్పులు జీవికి ఉండి,పోవునదియేగ జగతి ప్రతి ప్రళయములో ఉండి,పోవు ఈ జీవి నీ పదముల ఉండిపోవుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. దేవకార్య సముద్యతా ********************** ధర్మసంస్థాపనార్థాయా సంభవామి యుగేయుగే అని చెబుతున్నది భగవద్గీత. శిష్టరక్షణ-దుష్ట శిఖణ అను రెండువిధానములు కూడియున్న ధర్మ పరిరక్షణకై నిర్వికార/నిర్గుణ/నిరంజన చిత్శక్తి కొత్త కొత్త రూపములను ధరిస్తుంటుంది.ధర్మమును పరిరక్షిస్తుంటుంది.ఆ ప్రక్రియ దుష్టత్వమును సం హరించుటకు ముందు సంస్కరిస్తుంది.వంధ విముక్తులను చేస్తుంది. ఒక మంచి యొక్క గొప్పతనమును అర్థముచేసుకోవాలంటే దానికి అడ్దముగా నిలిచిన చెడు యొక్క అజ్ఞానమును కూడా తెలుసుకొనవలసిన...