SIVATANDAVASTOTRAM(SRIYAI CHIRAAYA JAAYATAAM)-05
.jpg)
సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః | భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 || మొదటి శ్లోకములో శివమును విస్తరింపచేయవలెనన్న ఆకాంక్షను వ్యక్తపరచిన సాధకుడు ప్రస్తుత శ్లోకములను శ్రియమును /సంపదలను స్వామి తాండవము విస్తరింపచేయవలెనన్ను ఆకాంక్షను తెలుపుతున్నాడు. ఇప్పటివరకు మనతో స్వామి జటలను,గంగమ్మను,కరిచర్మమును,డమరుకశబ్దమును ఆహార్యములో చూపిస్తూ,అగ్నిసోమాత్మకుని అర్థనారీశ్వరునిగా ఆరాధిస్తూ ఆ పవిత్ర తాందవము సకల చరాచరములను ఏ విధముగా చైతన్యము చేస్తున్నదో వివరిస్తున్న సాధకుడు మనకు దేవతలను వారి వినయ నమస్కారములతో రాలిపడిన పుప్పొడులతో వింతరంగులో ప్రకాశించుచున్న స్వామి పాదపీఠమును సాక్షాత్కరింపచేయుచున్నాడు. సాథకుని ఆకాంక్ష స్వామి సంపదలను సకలజగములపై విస్తరింపచేయుట. ఆ విషయమును నాలుగు విశేషములద్వారా మనకు తెలియచేస్తున్నాడు. స్వామి సిగను కీర్తించునప్పుడు చంద్రుని చకోరబంధువుగా. వెన్నెలతాగి ప్రాణమును నిలుపుకొనునది చకోరపక్షి.దానిని అనుగ్రహించు శక్తిని పొందిన చంద్రుని సిగపూవుగా ధరించినవాడు స్వామి.శాపవశమైన చం...