ADITYAHRDAYAM-SLOKAM-21

ఆదిత్యహృదయం-శ్లోకము-21 ********************* ప్రార్థన ****** "జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం తిమిరహిరణ పాప ద్వేషదుఃఖస్య నాసం అరుణకిరన గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వ రంగము *********** పరమాత్మ నాశయత్వేవ వైభూతం తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను 1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు. శ్లోకము ****** "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం." అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు. ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్షముగా నున్నది అన్నది ప్రస్తుతము. ...