AALO REMBAAVAAY-14

పాశురము-14 *********** ప్రతి పదము-పరమ పథమే పతి పదము-పరమపదమే. నంగాయ్-నాణాదాయ్-నావుడయాయ్ అంటు గోపికను మేల్కొలుపుతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ, "నెగిళిందు-కూంబిణగాం" అను ముకుళితము-వికసనము " అను పరమార్థమైన పదములను ,పాశురమును అనుసంధానము చసుకునే ప్రయత్నమును చేద్దాము. ఉంగళ్ పుళక్కడై తోటత్తు వావియుల్ శెంగుళునీర్వాయ్ నెగిళిందు ఆంబల్వాయ్ కూంబిణగాం శెంగళ్పొడి కూరై వెణ్పల్ తవర్ తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోదందార్ ఎంగళై మున్నమెళుప్పువాన్ వాయ్పేశుం నంగాయ్! ఎళుందిరాయ్! నాణాదాయ్! నావుడైయాయ్ శంగొడు శక్కరం ఏందు తడక్కైయన్ పంగయ కణ్ణానై ప్పాడు ఏలోరెంబావాయ్. లక్ష్మీనారాయణులు లీలగా ఒకసారి దాగుడుమూతలాడుకొనుచున్నారట.స్వామికి కనిపించకుండా/స్వామిని పట్టుకోనీయకుండా మహాలక్ష్మి పద్మములున్న తోటలోనికి వచ్చి,వాటిని విప్పారకూడదని శాసించి తాను అందులో ఒక విశాలమైన అందమైన పదముములో కూర్చుండి దానిని ముకుళింపచేసినదట.స్వామి అమ్మను వెతుకువెతుకుతు తోటలోని పద్మములన్ని ముకుళించియుండుటన...