Posts

ADITYAHRDAYAMU-25

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-26 ********************* ప్రార్థన **** " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********* శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,"సకలంభువనం-చకలము-బుకలము",ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే, ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు. ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో ఉపాధి నిరపేక్ష అనుసంధానము. ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ. ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో చెప్పి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడని కథనము. శ్లోకము ****** " అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యతి   ఏవం "ఉక్తా...

ADITYAHRDAYAMU-25

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-25 ********************** ప్రార్థన ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   కిరణ సమిత పాప ద్వేష దు@ఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********** ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా- అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు. ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు, "రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు. పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు, "ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖః సుఖినో భవంతు" అని ఫలసిద్ధిని నొక్కి వక్కాణిస్తుంటే, పరమాత్మను స్త్రీమూర్తిగా/అమ్మగాభావించి,స్తుతించేవారు, " అనేన సద...

ADITYAHRDAYAMU-23

Image
 ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పరమాత్మ నాశయత్వేవ వైభూతం తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను 1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు. శ్లోకము ****** "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః  ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."   అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు. ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్ష్మముగా నున్నది అన్నది ప్రస్తుతము. ఈ విషయమును అర్థము చేసుకోవాలంటే మనము, పరమాత్మ-ప్రపంచము అన్న రెండింటి మధ్యనున్న, స్థూల శరీరము- సూక్ష్మశరీరము-కారణ శరీరము-మహాకారణ శరీరముల గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము. 1.పంచభూతములకలయికచే ఏర్పడినది స్థూలశరీరము.ఇది దృ...

ADITYAHRDAYAMU-22

Image
  ఆదిత్యహృదయము-శ్లోకము-22 *********************** ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పూర్వ శ్లోకమును "తప్త-చామీకరాభాయ వహ్నియేవిశ్వకర్మిణే"అంటూ పరమాత్మను ప్రస్తుతిస్తుంది. చామీ కరము-బంగారు కిరణము.ఆ బంగారు కిరణము మేరుపర్వతమును పరమాత్మ స్పృశించుటచే ఏర్పడినది. .ఆ బంగారు కిరణము స్వామి అనుగ్రహమే. వేడిచే-వెలుగుచే తప్తమైనది/కాల్చబడినది.అంటే ఇతర లోహ ధాతువులను సైతము విడదీయలేంతగా తనలో కలుపుకొనిన బంగారపుకొండ స్వామి స్పర్శచే దోషములను ఆవిరిరూపములో/ద్రవరూపములో కరిగించుకుని/తొలగించుకుని,తప్తము చేసికొని,పుటమై,మేలిమిముద్దగా ప్రకాశిస్తున్నది.ఇది వాచకము. జీవుల ఉపాధి/దేహము మేరుపర్వతమే..అది మంచి-చెడులను విడదీయలేనంతగా తనలో కలుపుకుని సందిగ్ధములో ఉంది.స్వామి తన కరుణ అనే అగ్నితో దానికి పుటము వేసి శాశ్వతమైన-ఆత్మను-అశాశ్వతమైన ఉపాధిని వేరుచేసి ప్రకాశింపచేయుచున్నాడు.అదియే కదా, న ఛిందంతి శస్త్రాణి-న దహతి అన్న ఆత్మ వివేక సారము. పూర్వశ్లోకము కృతఘ్నఘ్నాయ అన్న ప్రళ...

ADITYAHRDAYAMU-21

Image
   ఆదిత్యహృదయం-శ్లోకము-21      ********  ప్రార్థన  ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణ సమితపాపం క్లేశ దుఃఖస్య నాశం   అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం-అంటూ , ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి. ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ. ఆ పరమాత్మ సూక్ష్మముగా , "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.  పరంజ్యోతి యైన పరమాత్మ తమమును-హిమమును-శత్రువులను-కృతఘ్నతను సంపూర్ణముగా నాశనము చేసి ,నిర్ద్వంద్వ స్థితిని ప్రకటించినాడు అని చెప్పిన అగస్త్యభగవానుడు పునః సృష్టిని చేయుచు,నిరంజనుదైన స్వామి సర్వమలినములను హరించివేసి,రోచిష్ముడై, పుటము వేసిన అగ్నివంటి వర్ణముతో ,కన్నులముందు కనపడుతూ,కిరణములనే కరములతో ,పంచకృత్య భారమును వహించు వహ్ని వలె, "తప్తంచకర-తప్తచామీకరుడై-ఆ భా-సమస్తమును ప్రకాశవంతము చేస్తున్...

ADITYAHRDAYAMU-20

Image
  ఆదిత్యహృదయం-శ్లోకము-20 ************************ ప్రార్థన ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం-అంటూ , ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి. ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ. ఆ పరమాత్మ సూక్ష్మముగా , "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు. ఒకవిధముగా చెప్పాలంటే పరమాత్మ "విఘ్నేశ్వర " కరుణావిశేషములే ప్రస్తుత శ్లోకము. శ్లోకము ****** " తమోఘ్నాయ-హిమఘ్నాయ-శత్రుఘ్నాయ-అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః" శ్లోక భావమును గ్రహించుటకు సహాయకారకముగా పూర్వశ్లోకములలో ప్రయోగించిన కొన్ని పదములను ప్రస్తుత శ్లోకముతో సంధాన పరచుకుందాము. "రశ్మిమంతం-సముద్యంతం" దేవాసుర నమస్కృతం." స్వామి తనకిరణ కాంతులను సంపూర్తిగా ప్రసరిం...

ADITYAHRDAYAMU-19

Image
 ఆదిత్యహృదయము-19   **************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగమ్ను ************* పరమాత్మ తన ఉగ్రత్వ-వీరత్వ సారంగత్వముతో సమస్తమును జాగృత పరచుచున్నాడన్న అగస్త్య భగవానుడు, ప్రస్తుత శ్లోకములో అదే ఉగ్రత్వ-వీరత్వ స్వభావమును మరింత తెలియచేస్తూ, "నిత్య-అనిత్య,సత్య-అసత్య జ్ఞానమును అందించుచున్నాడు." పరమాత్మ ప్రకాశత్వ పరమార్థమే మనము తెలుసుకొనబోవు శ్లోక మర్మము. శ్లోకము ******* "బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చశే "భాస్వతే" సర్వభక్షాయ" రౌద్రాయ వపుషే నమః ."  భాస్వతే-వర్చసే అను పదములప్రయోగము పరమాత్మ ప్రకాశత్వక పరమార్థ విశేషణములు.తేజసామపి తేజస్వి అనుగ్రహమే భాస్వత్వము-వివశ్వంతము.విస్తారముగా కాంతిని వ్యాపింపచేయుట. 1. ప్రస్తుత శ్లోక భావగ్రహణమునకు ముందుగా మనము ఒక్కసారి,స్తోత్రములోని ఇంతకుముందు చెప్పుకొనిన, " ఏష బ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద-ప్రజాపతిః మహేంద్రో ధనదః కాల యమః సోమః అపాంపతిః" శ్లోకములో, పరమాత్మను, నీవే బ్రహ్మవు, నీవే విష...