Posts

ADITYAHRDAYAMU-29

Image
   · ఆదిత్యహృదయం-శ్లోకం-29 ******************** ప్రార్థన ******* 'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం  తిమిర హిరణ పాప ద్వేష దుఃఖస్య నాశం  అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగం ********** ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుటకు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు. శ్లోకము ****** " రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్   సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్." ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము. దీనిలో దాగిన మర్మము మహాద్భుతము. భగవద్గీతలోని గుణత్రయవిభాగమును మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే. ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము. రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు. వీరిద్దరిలోను సమయానుకూలముగా త్రిగుణములు వాటి ప్రభావమును చూపిస్తున్నాయి. తమో గుణము-మోహ కారకము. రజోగుణము-కార్య కారకము,అంటే, మానసికముగా నున్న మోహమును ...

ADITYAHRDAYAMU-28

Image
  ఆదిత్యహృదయము-శ్లోకము-28 ********************** ప్రార్థన ****** "జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి. పూర్వ రంగము ********  అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే .  ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా విధానము పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది.  ఆచమనము అనగా భాషా[అర్థముగా) ద్రవమును స్వీకరించుట,త్రాగుట. సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూస్తూనే ఉంటాము.  సనాతనము సూచించిన ఈ నియమము షోడశ పూజా విధానములో/అథాంగ పూజలో, "హస్తే ఆచమనీయం సమర్పయామి" అని, పరమాత్మ మనకు అందించిన, మనలను పోషించుచున్న పంచభూతములకలోని జలమునకు కృతజ్ఞతను ఆవిష...

ADITYAHRDAYAMU-27

Image
 ఆదిత్యహృదయం-శ్లోకము-27 ******************* ప్రార్థన ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వ రంగము **********        యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.  తత్ఫలితముగా  రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు. సీతమ్మ ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు.  యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు. అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.   సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట. తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస్తున్నది. శ్లోకము ***** ఏతత్ శృత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రియతాత్నవాన్" పరమపావనమైన ఆదిత్యస్తోత్ర జపక...

GIRISAMCHA-ABHICHAKASE-SIVARATRI

Image
 గిరిశంచ-అభిచాకశీ **************** శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. గిరిశంచ అను పదమునకు పెద్దలు, కొండయందు-మన గుండెయను కొండయందున్నవాడు, వేదములయందుండి జగములకు మోదమొనరించువానిగను, ఇచ్చిన మాటయందుండి-అభయమిచ్చి-ఆర్తరక్షణమును చేయువానిగను భావిస్తారు. సర్వ వ్యాపకత్వముతో తానున్నానని (నమకములో) చెప్పుటయేకాక, తన ప్రకాశకత్వముతో సర్వ సమర్థవంతముగా చేస్తున్నాడు కనుకనే,  ఆ పరమాత్మ,  "గిరిశంచ-అభిచాకశీ" ***************  నమకములో దర్శనీయమైనది పరమేశ్వరము.              చమకములో దర్శకత్వమై మనలను ఉధ్ధరిస్తున్నది.    నమకములో దర్శించిన ఒక వెదురు చమకములో ఒక నిచ్చెనగా మారి మనలను ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుచున్నది. చమక పారాయణము , 'అజ్ఞా-విష్ణుసజోష" అంటు అగ్ని-విష్ణు నామములుగల రెండు చైతన్యవంతమైన శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.ఇవి ఆ శక్తుల కేవల వ్యవహారిక నామములా/ కావుకదా! అయితే సాధకుడు ఆ మహాద్భుతశక్తులను సూక్ష్మముగా తన శరీరములో-స్థూలముగా విశ్వశరీరములో దర్శిస్తు ఎందుకు ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాడు అన్న సందేహము మనకు కలుగవచ్చును. ఏ...

ADITYAHRDAYAMU-25

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-26 ********************* ప్రార్థన **** " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********* శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,"సకలంభువనం-చకలము-బుకలము",ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే, ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు. ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో ఉపాధి నిరపేక్ష అనుసంధానము. ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ. ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో చెప్పి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడని కథనము. శ్లోకము ****** " అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యతి   ఏవం "ఉక్తా...

ADITYAHRDAYAMU-25

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-25 ********************** ప్రార్థన ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   కిరణ సమిత పాప ద్వేష దు@ఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********** ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా- అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు. ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు, "రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు. పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు, "ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖః సుఖినో భవంతు" అని ఫలసిద్ధిని నొక్కి వక్కాణిస్తుంటే, పరమాత్మను స్త్రీమూర్తిగా/అమ్మగాభావించి,స్తుతించేవారు, " అనేన సద...

ADITYAHRDAYAMU-23

Image
 ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పరమాత్మ నాశయత్వేవ వైభూతం తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను 1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు. శ్లోకము ****** "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః  ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."   అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు. ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్ష్మముగా నున్నది అన్నది ప్రస్తుతము. ఈ విషయమును అర్థము చేసుకోవాలంటే మనము, పరమాత్మ-ప్రపంచము అన్న రెండింటి మధ్యనున్న, స్థూల శరీరము- సూక్ష్మశరీరము-కారణ శరీరము-మహాకారణ శరీరముల గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము. 1.పంచభూతములకలయికచే ఏర్పడినది స్థూలశరీరము.ఇది దృ...