Posts

ADITYAHRDAYAMU-18

Image
    ఆదిత్యహృదయము-18   ***************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము. సూర్యభగవానుని ఉదయాస్తమాన తూరుపు-పడమరదిక్కుల ప్రాశస్త్యమును, దినాధిపతిత్వమును-జ్ఞాన సంపత్తిని, పరమాత్మయొక్క,జయప్రదత్వమును-జయభద్రత్వమును స్తుతించిన అగస్త్యభగవానుడు,ప్రస్తుత శ్లోకములో ఉగ్ర/వీర స్వరూపమును,సారగ్రహణ స్వభావమును,మార్తండత్వమును(నాలుగు లక్షణములను) వివరించుచున్నారు. శ్లోకం ****** " నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః  నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమోనమః." ఉగ్రత్వమునకు-వీరత్వమునకు "నరసింహావతారమును " ప్రస్తావిస్తారు కొందరు ఉపాసకులు . 1. సూర్యభగవానుడ-నీవు ఉగ్రుడవు-నీ ఉగ్రత్వమునకు నమస్కారములు. ఉగ్రత్వమంటే భయంకరముగా కనిపించటమా అనుకుంటే కాదు అని చెబుతున్నది సనాతనము. "ఉత్ గ్రసతి ఉగ్రం" అంటున్నది సాహిత్యము. అన్నింటికిమించిన ఉన్నతస్థితి.అదియే పరమానందము/బ్రహ్మానందము.ఆ స్థితిని కలిగించువాడు ఉగ్రుడు .కాదు కాదు, ఉత్కృష్టస్థితియే తానైన వాడు ఉగ్రుడు.ఇదే ...

ADITYAHRDAYAMU-17

Image
         ఆదిత్యహృదయం-17   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము. *********** " తేజసామపి తేజస్వి" మండల వాసియై తన శక్తులచే నక్షత్రములను-తారలను-గ్రహములను-జ్యోతిర్గణములను నిర్మించి,వానిచే వెలువడుచున్న రశ్ములచే సకలభువన సాక్షియై, " ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచుచు, ప్రస్తుత శ్లోకములో జయజయ ధ్వానములచే కీర్తింపబడుచున్నాడు. శ్లోకము ****** " జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః" నమోనమః శబ్దమును మూడుసార్లు ప్రయోగించారు మహర్షి వాల్మీకి.కొంతమంది దీనిని పునరావృతముగా భావిస్తే త్రికరణములతో సమర్పించు నమస్కారముగా ఉపాసకులు భావిస్తారు. ప్రస్తుత శ్లోకము ఆదిమూర్తి యైన ఆదిత్యుని, 1.జయప్రదునిగా 2.జయభద్రునిగా 3.సహస్రాంశునిగా 4.హర్యశ్వనునిగా , పూజిస్తున్నది. హరితము పచ్చదనము అభిలషించు మనసును హర్యశ్వముగా,భావనచేస్తూ,అదియును అనేకానేకములు/సహస్రములు,పరమాత్మను ధ్యానిస్తే,జయములు ప్రాప్తిస్తాయి-ప్రాప్తించిన ...

ADITYAHRDAYAMU-16

Image
        ఆదిత్యహృదయం-16   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము *********** ఏదీ అంటని ఆత్మస్వరూపమైన పరమాత్మ ఆదిత్యునిగా ఆకాశ నివాసియై,మండలము నుండి తన రశ్ములను భూమందలముపై ప్రసరింపచేయుటకు నక్షత్రములను-తారలను-గ్రహములను కొన్ని పరికరములను ఏర్పరచి,తాను అంతర్యామియై వానిలో ప్రవేశించి,పన్నెందు విభాగములుగా కాలమును,పది ఇంద్రియములు బుద్ధి-మనసు అను విభాగములను చేతనులలో ఏర్పాటుచేసిన విధానమును వివరించిన,అగస్త్య భగవానుడు "కవి" గా స్వామి ప్రపంచ కల్పనాచాతుర్యమును కన్నులముందుంచిన తరువాత, ప్రస్తుత శ్లోకములో స్వామి ఉదయాస్తమాన ప్రక్రియను ప్రశంసిస్తున్నారు. శ్లోకము. ***** " నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః." తూరుపు దిక్కును తన రశ్ములచే ప్రకటింపచేసినసూర్యునకు నమస్కారములు. ( పశ్చిమ దిక్కును చేరి మరొక ప్రదేశములో తన రశ్ములచే ఉదయిస్తూ తూరుపుదిక్కుగా ప్రకాశిస్తున్న) పశ్చిమ అద్రిపై వాలుచున్న సూర్యునకు నమస...

ADITYAHRDAYAMU-15

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-15  *********************   ప్రార్థన   "జయతు జయతు సూర్యం- సప్తలోకైకదీపం   కిరణసమిత  పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యవర్ణం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  *******  ఆకాశాధిపతి ప్లవంగము( దక్షిణదిశ వైపునకు)వలెదుముకుతూ,వేదవేద్యుడై,వేదపూజ్యుడై,కరుణ నిండిన కరిమబ్బులతో వర్షములను గురిపిస్తూ,జలములను సమృద్ధి పరచుచున్నాడన్న,అగస్త్యుడు,  ప్రస్తుత శ్లోకములో సూర్యమండలమును సంకీర్తిస్తూ,పరమాత్మ పింగళ వర్ణుడై ఉత్తరాభిముఖుడై,ఉత్తర దిశగా తన గమనమును సాగిస్తూ,అనురక్తితో విశ్వ నిర్మాణమును స్థితి సంహారములను గావిస్తున్నాడో వివరిస్తున్నారు. అదియే మండల విన్యాసము.సామూహిక శక్తుల సమన్వయము.  శ్లోకము  ******  " ఆతపీ మండలీ మృత్యుః పింగళః  సర్వ తాపనః    కవిః విశ్వో మహాతేజః రక్త సర్వ భవోద్భవః."   భవిష్యోత్తర పురాణము శ్రీకృష్ణార్జున సంవాదముగా,  " యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం    ఉత్పత్తి రక్ష ప్రళయ ప్రగల్భం    యస్మిన్ జగత్ సంహర లేఖనంచ    ...

ADITYAHRDAYAMU-14

Image
 ఆదిత్యహృదయము-14    ***************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం  భాస్కరం  తం నమామి."   పూర్వరంగము   ****ఆతపీ మందల మధ్యస్థునిగా పరమాత్మను ప్రశంస్తూ,స్వామి విశ్వరచనా దక్షతను ఉత్తర-దక్షిణ అయన మార్గ సంచారమును వివరించిన,మహర్షి, ప్రస్తుత శ్లోకములో స్వామివిశ్వర రచనా వైభవమును,తన పర-వ్యూహ-విభవ-అర్చా-అంతర్యామి స్వభావ మును లోకవిదితము చేయుచున్నారు. శ్లోకము ******* 'నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి "ద్వాదశాత్మం నమోస్తుతే". ప్రస్తుత శ్లోకము నమోస్తుతే ఓ ద్వాదశాత్మన్ అంటూ, సూర్యభగవానుడు తన శక్తులను పన్నెండు విభాగములుగా ఏర్పరచి /వ్యూహరచనను చేసి,తద్వారా తన విభవమే సమస్తముగా మలచి,వానిలో తాను అంతర్యామియై,ప్రత్యక్ష అర్చనమునకు అనుగ్రహిస్తూ,అర్చామూర్తియై ఆరాధనములను  అనునిత్యము గ్రహిస్తూ,మనలను అనుగ్రహిస్తున్నాడు. అనుసరిస్తూ,గ్రహించే అంతరిక్ష శరీరధారులే గ్రహములు.గోళాకారమును కలిగిన తొమ్మిది ముఖ్యగ్రహములు సూర్యలేక ఇతర నక్...

ADITYAHRDAYAMU-13

Image
     ఆదిత్యహృదయము-13    ***************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం  భాస్కరం  తం నమామి."   పూర్వరంగము ********* పరమాత్మ హిరణ్యగర్భునిగా,తన తేజస్సుతో అగ్నిగర్భుడై,రవి యై తపమును కలిగిస్తూ,శిశిరమును తొలగిస్తున్నాడు.అంటే ఘర్మసర్జన కిరణములతో శబ్దస్వరూపునిగా ప్రకాశిస్తున్నాడన్న అగస్త్యుడు, ప్రస్తుత శ్లోకములో ఆ శబ్ద వైశిష్ట్యమును-జలతత్త్వమును-దక్షిణాపథ గమనమును ,విజ్ఞానప్రదాత్వమును స్పష్టముగా తెలియచేస్తున్నాడు. శ్లోకము ***** " వ్యోమనాథః తమోభేది ఋగ్యజుసామ పారగః   ఘనవృష్టిః అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః"  స్వామి వ్యోమ వాసియై తన రశ్ములచే చీకట్లను తొలగించువాడు.ఇది వాచికము.  స్వామి ఆత్మస్వరూపియై తన జ్ఞానముచే అజ్ఞానమును పారద్రోలువాడు.  స్వామి త్రయీమూర్తిం వేదం అన్న ఆర్యోక్తిని నిజముచేస్తూ ,సుప్రభాత సమయమున  ఋగ్వేదముగాను-మద్యాహ్న సమయమున యజుర్వేదముగాను -అస్తమాన సమయముబ సామవేదముగాను,మూడువేదములచే సంస్తుతింపబడ...

ADITYAHRDAYAMU-12

Image
  ఆదిత్యహృదయము-12   *****************   జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకరుణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.    పూర్వ రంగము *********** పరమాత్మ హరిత గుర్రములను-రథమును-సప్తశబ్ద ప్రాభవమును తెలియచేసిన అగస్త్యమహాముని,  పరోక్షముగా మనకు-ప్రత్యక్షముగా రామచంద్రునికి,ప్రస్తుత శ్లోకములో ద్వంద్వ విభాగములను-శాశ్వతత్త్వమును వివరిస్తూ,స్వామి ఏ విధముగా తన ప్రచండత్వమును-ప్రసన్నత్వమును అనుగ్రహిస్తూ,లోకరక్షణము గావిస్తున్నాడో వివరిస్తున్నారు. ఋగ్వేదము-వాల్మీకి రామాయణము-ఆదిత్యహృదయము పరమాత్మ ప్రాభవమును మానవులకు అర్థమయ్యే విధముగా సులభతరము చేసి ,చైతన్యవంతము చేస్తున్నది. శ్లోకము ****** " హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః   అగ్నిగర్భో దితేపుత్రః శంఖః శిశిరనాశనః"        ఋగ్వేడము స్తుతించినట్లు పరమాత్మ, 1హిరణ్యగర్భుడు-అగ్నిగర్భుడు. ************************  హితము-రమణీయము హిరణ్యము.ఇక్కడ హిరణ్యగర్భపదమును అంతః-బహిశ్చ యత్ సర్వం కింద భావిస్తే, " హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూ...