DEVAKAARYASAMUDBHAVA-SUMBHA NISUMBHA-maata KAUSIKI
.jpg)
శుంభస్యైచ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని రూపందేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి శుంభ/నిశుంభులను ధూమ్రాక్షుని సంహరించి ధర్మమును కాపాడుచున్నతల్లి నా ఇంద్రియములను సైతము నిన్ను ఆరాధించుటకు సుముఖము చేసి నా అంతర్/బహిర్ శత్రువులనుండి నన్ను రక్షింపుము. పరాశక్తి మధు/కైటభులను,మహిషాసురునికి సంబంధించిన అసురులను,వానిని,ధూమ్రాక్షుని,చండ/ముండులను ,రక్తబీజుని సంకేతనామములుగా నున్న ఇంద్రియముల బలహీనతలను నిర్మూలించినది.ఇక మిగిలిన వారు శుంభ/నిశుంభులు.నేను అను అహంకారము-నాది అను మమకారము. వీటి గురించి వీటిచే ప్రభావితమైన ఇద్దరి గురించి మనము ఒకసారి మాట్లాడుకుందాము. మార్కండేయ పురాణములో మహర్షి సురథుడు అను రాజు రాచరికమును కోల్పోయి వేట నెపముతో ఒంటరిగా గుఋఋఅము నెక్కి అడవులకు పోయెను. పేరు సురథుడు.దశరథుడు మనకు దుర్తుకు వస్తాడు కద.మంచి ఇంద్రియములు కల శరీరము కలవాడు.గుర్రమునెక్కి ,మనసు మాట విని అడవులకు పోయెను.ఒక విధముగా బుద్ధిని పనిచేయనీయనిచోటు. కనుకనే పరహస్తగతమైన తన రాజ్యముపై భ్రాంతిని వీడలేని పరిస్థిలో నున్నాడు. వేరొక వ్యక్తి సమాధి.వైశ్యుడు.ధనము ...