NAH PRAYACHCHAMTI SAUKHYAM-29

నః ప్రయచ్చంతి సౌఖ్యం-29 *********************** భగవంతుడు-భగవదంశ ఇద్దరును మార్గబంధువులే " నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః." లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు వర్ణముల కలబోతతో ప్రకాశించు,మార్గములకు అధిపతి యైన రుద్రునకు నమస్కారములు. జీవుల కర్మాచరణ ఫలితముగా వారిని,పునరావృత్తి సహిత,పునరావృత్తి రహిత,విదేహ ముక్తి మార్గములలోనడిపించ కరుణించు రుద్రస్వామికి నమస్కారములు.కొందరితో కఠినముగా ,మరి కొందరితో కరుణాసంద్రముగా కనికరిస్తూ వారి పాపకర్మలను భరింపచేస్తు,హరింపచేస్తు భవబంధవిముక్తులను చేయు శుభంకర! నమస్కారములు. శంకరాచార్యులు 8వ శతాబ్దములో కాలడిలోఆర్యాంబ-శివగురువులకు శివాంశగా వైశాఖశుధ్ధ పంచమి,ఆరుద్రా నక్షత్ర సమయమున జన్మించారు.ప్రపంచలో రెండు అను తత్త్వము లేదని అంతా ఒకతే అను అద్వైత సిధ్ధాంతమును ప్రతిపాదించినారు. " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ." " న ద్వైతం సమస్తం ఏకం" అని భావించు భగవదంశ పుణ్య-పాప మిళితమైన మర్త్యలోకమున సామాన్య మానవునిగా ,మార్గబంధువుగా జన్మించుటకు కారణము వైదిక ధర్మ పునరుధ్ధరణమే. " నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ." జటాధ...