Posts

Showing posts from September 7, 2017

PRADYUMNAE SRNKHALAADEVI

Image
        ప్రద్యుమ్నే శృంఖలాదేవి   " ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖల నామ భూషితే     విశ్వ విమోహితే దేవి శృంఖల బంధనాశిని"    వంగదేశములోని  ప్రద్యుమ్న నగరములో పడిన మాయా సతి పొట్ట భాగము "శృంఖలాదేవి" గా ఆరాధింపబడుతున్నడి.ఈ తల్లిని" శృంగలాదేవి","సిం హళాదేవి" అని కూడా ఆరాధిస్తారు.   సిం హళ అనే శబ్దమునకు సంకెల -బాలెంత నడుము కట్టు అని కూడా వ్యవహారములో ఉంది.స్థలపురాణము ప్రకారము ఈ ప్రదేశములో ఋష్యశృంగ మహాముని అమ్మవారిని  పూజించి,కటాక్షమునకై తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట.ఇక్కడ మనకు "ఋష్యశృంగము" అను పెద్ద కొండ ఆ ముని గుర్తుగా మనకు దర్శనమిస్తుంది.అతడు అమ్మతో సహా కర్ణాటక లోని  శృంగేరీ పీఠమును దర్శించి తిరిగివచ్చి ఈ స్థలములో అమ్మ శక్తిని ప్రతిపాదితము చేశారట.భక్తానుగ్రహముతో తల్లి శృంగలాదేవి నామముతో ఆరాధింపబడుతుందట.   ఇంకొక ఐతిహాసిక కథనము ప్రకారము ధర్మనిరతికై శ్రీకృష్ణపరమాత్మా రుక్మిణీమాతలను పరీక్షింపదలచి వారిని బండికాడికి కట్టి లాగమన్నాడట.లాగుతున్న సమయములో అమ్మవారికి దాహమువేయగా స్వామి   జలమును అందించినాడట.అమ్మ దప్ప...

KAAMAAKSHI KAAMCHIKAPURE

Image
   కామాక్షి కాంచికాపురి   ***************************   "పుష్పేషు జాజి పురుషేషు విష్ణు    నారీషు రంభ  నగరేషు కంచి"  ఆర్యోక్తి.   మాయాసతి వీపు భాగము పడిన ప్రదేశము కామాక్షి దేవిగా భక్తుల  కల్పతరువైనది.అయ్యవారు  ఏకామబరేశ్వరుడు.ఏకామ్రేశ్వరుడు అను కూడా పిలుస్తారు.అమ్మవారి సైకత లింగ పరమేశ్వరిని మామిడిచెట్టుక్రింద్ అ నిలిపి తపమాచరించి పతిగా పొందినది.పంచభూతాత్మిక క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది కంచీపురము.   "అయోధ్యా మధురా మాయా కాశి కాంచి అవంతికా" అను భారత దేశములోగల సప్త మోక్ష పురములలో ఒకటి.ఆద్వైత విద్యకు ఆధారస్థానము.పూర్వకాలములోని అలంకారికులు లాక్షణికులు తమ రచనలను ప్రమాణీకరణకు కంచికి పంపి వారి ఇంటిముఖము పట్టెడివారు కనుక కథ కంచికి మనము ఇంటికి అను నానుడి.ఎందరో కవులు చరిత్రకారులు విదేశీ యాత్రికులు(పాహియాను) కాంచీ వైభమును గురించి ప్రస్తావించిరి.  " క" కారము సృష్టికి" మ" కారము పోషణకు ప్రతీకలుగా గుర్తిస్తారు.కామాక్షి విలాసము అను గ్రంధము ప్రకారము అమ్మ శక్తిని మన్మథుని యందు ఆవహింపచేస్తుందట.   ..ఇతిహాసకథల ప్రకారము అమ్మ భీకర...

LANKAAYAAM SAANKAREEDEVI.

Image
  1.లంకాయాం శాంకరీదేవి-కామాక్షి కంచికాపురి.     **************************************************    సంస్కృతములో శ్రీ అంటే భవ్యమైనది.లంక అంటే తేజస్సుగల భూమి లేక ద్వీపము.జలావృత భూభాగము లంక.ఇక్కడ పడిన మాయాసతి మొలభాగము శాంకరీదేవిగా ప్రకాశించుచున్నది.త్రికోణేశ్వరుడు అయ్యవారు.దక్షిణసముద్రతీరముననున్నది.ఇక్కడ పార్వతీదేవి శివలింగము లోపల కొలువై భక్తులకు దర్శనమిస్తారు.స్థపురాణ కథలను బట్టి ఒకసారి ఆదిశేషునిలో వాయుడేవునిలో అహము ప్రవేశించి విపరీత పరిస్థితులకు దారితీసెను.దాని పర్యవసానముగా శివుడు దక్షిణతీరమును కైలాసముగావించ దలచెను.    శివుని ఆన గాన అమ్మవారి మదిలో లంకలో ఒక అపురూప సుందర భవనమును నిర్మింపచేసుకుని  సకుటుంబముగా నివసింపదలచెను.ఆమె ముచ్చట తీర్చుటకు శివుడు విశ్వకర్మచే పరమాద్భుత భవనము నిర్మింపబడేను.గృహప్రవేశ పౌరోహిత్య అవకాశము రావణుని వరించినది.భవనసౌందర్యమునకు మోహితుడైన రావణుడు పూజానంతరము ఆ భవనమును దక్షిణగా కోరెను,(ధర్మముకాదని తెలిసియు)కరుణాంతరంగ అందులకు అంగీకరించి రావణుడు ధర్మము తప్పనంత కాలము ఊండుటకు అంగీకరించెను.సీతాపహరణ సమయమున అమ్మమాటలు పెడచెవిన పె...