MAHA SIVARAATRI-02

పరమేశుడు వచించిన ప్రకారముగా సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ముఖములను తనలింగములో నిక్షిప్తము చేసికొని దర్శనమిచ్చిన శుభ సందర్భము.ఈ ఐదు ముఖములు తమలో పంచభూతత్త్వమును,షట్చక్ర నిర్మానమును,కోశ సంపదను,బీజాక్షర విజ్ఞానమును,సప్తస్వర రాగములను,ఐదు దిక్కులను,ప్రణవ నాదములోని అక్షరములను,మరెన్నో రహస్యములను పొందు పరచుకొని కన్నులవిందు చేయుచున్నవి. 1.సద్యోజాత శివ స్వరూపము లింగము సంకేతముగా,శుభరూపము శివునిగా సృజనాత్మక తత్త్వముతో నిశ్చయముగ శుభములొసగు పశ్చిమాభిముఖుడు,పరమ కరుణాంత రంగుడు సద్యోజాత నామ శివుడు సకల శుభములొసగు గాక. సద్యోజాత శివుడు పశ్చిమాభిముఖుడు."శి" బీజాక్షరము ఇతడు.మనోమయకోశ పాలకుడు.అగ్నితత్త్వము కలవాడు.సప్త స్వరములలోని పంచమ స్వరము.మణిపుర చక్రమునకు అధిపతి.ఓం కారములోని మకారము.సద్య: అనగ అప్పుడె జాత: అనగా పుట్టినవాడు.ఈ శివుడు జీవులలో ప్రవేశించి సృష్టి కార్యమును నిర్వ హిస్తూ,మనలనందరిని అనుగ్రహించు గాక. అఘోర శివ స్వరూపము లింగము సంకేతముగా,గుణరహిత మూర్తిగా మేథ-జ్ఞాన తత్త్వములతో సకల విద్యలనొసగు "దక...