MAHAA SIVARAATRI-01

  మహా శివరాత్రి
 ****************
 సృష్టి ప్రారంభమునకు ముందు చరాచర జగతి శూన్యముగా నుండెడిదట.ఆ శూన్యమునందు పరమేశుని తేజస్సు ప్రవేశించి ,చలనముతో దానిని తేజోవంతము చేసినదని అధర్వణ వేదములోని అధర్వ శివోపనిషత్తు ఘోషించుచున్నది.

  ప్రతిజీవిలో పరమేశుని శక్తి నీవారశోక ప్రమాణమున(గడ్డిపోచ కొన) ప్రవేశించుటచే,తదనుగుణముగా పంచభూతములు,సూర్య చంద్రులు,సముద్రములు మొదలగునవి కూడ చైతన్యవంతమయినవి.పరిణామ ప్రభావితులైన దేవతలు ఈశ్వర సంకల్ప ప్రేరితులై "నీవెవరవు?"? అని ఆ తేజోమూర్తిని ప్రశ్నించిరి. 

    వారిని సమాధానపరచ దలచి పరమాత్మ వారితో అద్వైతము-ద్వైతము-త్రికాలములు-చతుర్వేదములు-పంచభూతములు-షట్చక్రములు-సప్త స్వరములు-అష్ట దిక్కులు-నవగ్రహములు-నవావరణములు-    కొశములు-దశేంద్రియములు-ప్రణవమైన ఓంకారము మొదలగునవి అన్నీ తననుండి ఆవిర్భవించినవని,అవి సమయానుకూలముగా సూక్షమమునుండి స్థూలముగాను,స్థూలము నుండి సూక్ష్మము గాను మారుచుండునని,తానును సమయాచారమును బట్టి రూపిగను-అరూపిగను ప్రకటింప బడుదునని చెప్పెను. 

  ప్రతి మాసమునందును బహుళ చతుర్దశి మాస శివరాత్రి అయినప్పటికిని మాఘ బహుళ చతుర్దశి నాటి లింగోద్భవ కాలము మహా శివరాత్రి పుణ్య విశేషముగా పరిగణింపబడుచున్నది.పరమేశుడు సెలవిచ్చిన సాకార-నిరాకార తత్త్వ ఉద్భవము(.పైనుండి కిందికి వచ్చిన అవతరణము.కిందనుండి పైకి వచ్చిన ఉద్భవము.)  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)