TIRUPAAVAI-03

తిరుప్పావై-మూడవ పాశురము ********************* "మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతఃపయోధి దుహితః సహజాం విదుస్త్వాం." పూర్వ పాశుర ప్రస్తావనము ******************** రెండవ పాశురములో కృత్యాకృత్య వివేకమును బోధించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ "లీలావతారమైన " వామన మూర్తి (మత్స్య-కూర్మ-వరాహ-నారసింహ-వామన- ధర్మసంరక్షనము ఒక్కపర్యాయము అవతరించి-సమస్యను పరిష్కరించి అవతార సమాప్తిని గావించుట) అనుగ్రహమును సోదాహరణముగా చెబుతూ ,కృత్య విభూతిని స్మరిస్తూ ,ఏ విధముగా వామనమూర్తి మూడు అడుగులతో ధర్మమును రక్షించినాడో-అదేవిధముగా మన బాలకృష్ణుడు సైతము మనలను ఉద్ధరించగలడు కనుక సందేహమును వీడి నోమునకు ఉద్యుక్తులమగుదామని ,సత్ఫలితములు కలుగుతాయని ...