KADAA TVAAMPASYAEYAM-05

కదా త్వాం పశ్యేయం-05 ******************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామిభగవత్పాదం శంకరం లోక శంకరం." " మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ కరౌ చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనా విధౌ తవ ధ్యానే బుద్ధిః నయన యుగళే మూర్తి విభవం" మనమనోఫలకముపై ముద్రించుకుని ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. మిత్రులారా శంకరయ్య లా పరమాత్మను , (దూషిస్తూ బిల్వార్చన అంటుందేమిటి అన్న అనుమానము మీలో కలుగ వచ్చును.న-ఇతి, ఇది కాదు ఇదికాదు అన్న తత్త్వమును అర్థము చేసుకునే ప్రహసనములో అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ అయినప్పటికిని ఆదిదేవుడు నా అపరాధములను మన్నించి,తన అక్కున చేర్చుకుంటాడన్న ఆశతో,) ఇంక థలోనికి వస్తే, వాడు( నా)పరవశుదే అనుకుంటూ నడుస్తున్నాడు శంకరయ్య. వీడు (నా)పర- వశుడే అనుకుంటూ అనుసరిస్తున్నాడు శివయ్య. వారిరువురి పరవశమునకు భంగము కలిగిస్తూ, హరహర మహాదేవ్-హరహర మహాదేవ్ ...