CHIDAANAMDAROOPAA-CHAERAMAN PERUMAL NAAYANAARU

చిదానందరూపా-చేరమాను నాయనారు-29 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను వీతరాగుడు తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె పశుపక్ష్యాదులు సైతము ప్రశాంతముగ పరవశించె రతిపతిని కాల్చినవానిని రాజు రజకునిలోన గాంచె విశ్వేశ్వరుడీతడేనని వినయ నమస్కారమును గావించె తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్ తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్తుడు కానందున వయసురాగానే సన్యసించి తిరువంజక్కళములో శివపూజాదులతో నిశ్చింతగా నుండెను.శివ నిఎదేశమైనదేమో ఆ దేశపు రాజైన సెన్ గ...