SREESUKTAM-10-MANASAH KAAMA VAAKUTI.

శ్లోకము "మనసః కామం ఆకూతిం వాచః సత్యం అసీమహి పశూనాం రూపం అన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః" క్షుప్తిపాసాం మలా జ్యేష్ఠాం అలక్ష్మీ నాశయ అని ప్రార్థించిన సాధకుడు ప్రస్తుత శ్లోకములో పాడి-పంటలను అనుగ్రహించే "ధాన్యలక్ష్మి"ని తన దగ్గర స్థిరముగా ఉండునట్లు అహ్వానించమని జాతవేదుని ప్రార్థించుచున్నాడు. ఓ జాతవేద-శ్రియం అసీమహి. శ్రేయోదాయకమైన మహాలక్ష్మిని నా దగ్గరకు చేర్చుం.ఆ తల్లి అనుగ్రహముతో, నా త్రికరణములు సత్యమార్గమునూనుసరించగలుగుతాయి. అదియే నా -ఆకూతి-సంకల్పము. నామనసః-మనస్సు-వాచః-పలుకులు-తద్వారా నేను కోరుకునే కోరికలు/కామం సత్యసంపూర్ణములై సన్మార్గమును అవలంబిస్తాయి. తద్వారా , అకూతిం-సంకల్పము సిద్ధించి నేను సంతృప్తిని పొందుతాను.దృఢసంకల్పము నన్ను అమ్మ అనుగ్రహముతో సిద్ధిని పొందేటళుగా చేస్తుంది. తత్ఫలితముగా , పాశూనాం-రూపం-అన్నస్య మయి అసీమహి. పశువుల ద్వారా పాడి,పంటలద్వారా అన్నము లభిస్తాయి.ఇదిఒక భావన. ఇంతకుముందరి శ్లోకములో "కరీషిణీం" గోమయమును ప్రసాదించే త...