Posts

Showing posts from September 2, 2024

SREESUKTAM-10-MANASAH KAAMA VAAKUTI.

Image
  శ్లోకము  "మనసః కామం ఆకూతిం వాచః సత్యం  అసీమహి   పశూనాం రూపం అన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః"     క్షుప్తిపాసాం మలా జ్యేష్ఠాం  అలక్ష్మీ నాశయ అని ప్రార్థించిన సాధకుడు ప్రస్తుత శ్లోకములో పాడి-పంటలను అనుగ్రహించే "ధాన్యలక్ష్మి"ని తన దగ్గర స్థిరముగా ఉండునట్లు అహ్వానించమని జాతవేదుని  ప్రార్థించుచున్నాడు.   ఓ జాతవేద-శ్రియం అసీమహి.  శ్రేయోదాయకమైన  మహాలక్ష్మిని  నా దగ్గరకు చేర్చుం.ఆ తల్లి అనుగ్రహముతో,  నా త్రికరణములు సత్యమార్గమునూనుసరించగలుగుతాయి.   అదియే నా -ఆకూతి-సంకల్పము.  నామనసః-మనస్సు-వాచః-పలుకులు-తద్వారా నేను కోరుకునే కోరికలు/కామం సత్యసంపూర్ణములై సన్మార్గమును అవలంబిస్తాయి.    తద్వారా ,  అకూతిం-సంకల్పము సిద్ధించి  నేను సంతృప్తిని పొందుతాను.దృఢసంకల్పము నన్ను అమ్మ అనుగ్రహముతో సిద్ధిని పొందేటళుగా చేస్తుంది.    తత్ఫలితముగా , పాశూనాం-రూపం-అన్నస్య మయి  అసీమహి.   పశువుల ద్వారా పాడి,పంటలద్వారా అన్నము లభిస్తాయి.ఇదిఒక భావన.   ఇంతకుముందరి శ్లోకములో "కరీషిణీం" గోమయమును ప్రసాదించే త...

SREESUKTAM-09-GAMDHADVAARAAM

Image
     శ్లోకము  " గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం    ఈశ్వరీగ్0 సర్వభూతానాం తాం ఇహ ఉపహ్వయే  శ్రియం."      క్షుప్తి పాసా మలాం అన్న సమస్యకు పరిష్కారము ప్రస్తుత శ్లోకము.    శ్రేయమును కలిగించుటకు మహాలక్ష్మికి నాప్రార్థనను వినిపించు ఓ జాతవేద!    శ్రేయ స్వరూపిణీయిన మహాలక్ష్మిని,తన పరిమళము ద్వారా భూలక్ష్మిగా ప్రకటింపబడుతున్న భూలక్ష్మికి నేను తనను నా దగ్గరగా వచ్చి నిలిచియుండమని ప్రార్థించుచున్నానని చెప్పు.     ఆతల్లి,    ప్రథ్వీ తత్త్వముతో పచ్చిలకులుగా,సౌగంధికవనములుగా ,పండ్లతోటలుగా,పంట పొలములుగా,కొండ చరియలుగా వివిధ రూపములతో తన సుగంధమును  వెదజల్లుతూ మనకు దర్శనమిస్తున్నది.    ఆ భూలక్ష్మియే తన అనుగ్రహమును పాడి-పంటల రూపముతో ప్రకటింపచేయుచు "ధాన్యలక్ష్మి" గా  దర్శనమిస్తూ ధన్యతను అనుగ్రహిస్తున్నది.    ఆకలితో పాటు దప్పికను తీర్చుటకై ఆ భూలక్ష్మియే నదీమతల్లిగా మారి జలలక్ష్మిగా కీర్తింపబడుతున్నది.   ఆ మహాశక్తియే గోవులను తన ప్రతిరూపముగా సృష్టించి పుష్టిని ఇస్తున్నది.   ...