ADITYAHRDAYAM-SLOKAM-28

ఆదిత్యహృదయము-శ్లోకము-27 ********************** ప్రార్థన ****** "జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి. పూర్వ రంగము ******** అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే . ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా విధానము పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది. ఆచమనము అనగా భాషా[అరముగా ద్రవమును స్వీకరించుట,త్రాగుట. సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూ...