Posts

Showing posts from September 12, 2017

PURUHOOTIKAA PEETHIKAAPURAE

Image
   "పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత    పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి"   మాయాసతి పీఠికాభాగము పడిన ఆంధ్ర ప్రదేశములోని పవిత్ర స్థలమును "పీఠికాపురము" అనియు,పిఠాపురము అనియు,పిష్ఠపురము అనియు,పాదగయ అనియు భావిస్తూ,భజిస్తూ ఉంటారు.పీఠికాపురి పాలిని "పీఠాంబ" అని నమ్ముతారు.ఆ తల్లి ఒక చేతిలో బంగారు పాత్ర,వేరొక చేత బాగుగా పండిన ఉసిరికాయ,మరొక చేత త్రిశూలము,నాల్గవ చేత లోహదండమును ధరించి నేత్రోత్సవము చేసెడిదట.వృతాసుర సంహార దోషమును తొలగించుకొనుటకు ఇంద్రుడు అమ్మగురించి అత్యంత నియమ నిష్ఠలతో తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట అమ్మ సంతసింసించి ఇంద్రుని మరొక పేరైన (పురుహూతుడు)పురుహూతిక నామమును స్వీకరించి,ఆశీర్వదించినదట. హుంకారిణి శక్తిపీఠ్ముగా ప్రసిద్ధిచెందిన స్థలములో వెలిసిన తల్లిని " ఓంకారిణి" అని కూడా పిలుస్తారు.   ఇంద్రునిచే నిర్మింపబడిన పంచ మాధవక్షేత్రములలో ఒకటైన "కుంతీ మాధ క్షేత్రము" ఇక్కడ కలదు.పిఠాపురమునకు ఉత్తరదిక్కున "ఏలేరూఅనే ఏరు ఒకటి ఉంది.దీనిని ప్రస్తుతము చెరుకుల కాలువ అని పిలుస్తున్నారు    రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడ...

UJJAYINYAAM MAHAA KAALI

Image
   "ఉజ్జయిన్యాం  మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి    క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని"  మధ్యప్రదేశములోని  మాల్వా పీఠభూమి యందు,క్షిప్రనదీ తీరములోని మాల్వ పీఠభూమి యందు,పదహారు జనపదములలె ఒకటైన అవంతీ రాజ్యమునందు పడిన మాయాసతి పై పెదవి/పలువరస ఉజ్జ్వల మహా కాళిగా/మహా కాలునిగా ఆవిర్భవించెను.దీనిని "మహా శ్మశానము" అని కూడా అంటారు   చంద్రసేనుడను భక్తుని రక్షించుటకు శివుడు ఇక్కడ వెలిశాడని అంటూంటారు.విక్రమాదిత్యుడు,సాందీపని,మహాకవి కాళిదాసు తరించిన ప్రదేశము కనుక ,సాధనతో ఎందరో మహానుభావులు సిద్ధిపొందిన క్షేత్రము కనుకను,సిద్ధమాతా క్షేత్రమని కూడా వ్యవహరిస్తారు.   మంగళనాథుని కోవెల కుజునిచే నిర్మింపబడినదని ఇక్కద మంగళగ్రహ దివ్యశక్తి కలదని,దర్శించిన ప్రజలు కుజదోషము నుండి విముక్తులగుదురని భక్తుల విశ్వాసము..    అబంతీ పట్టణము కాలక్రమమున ఉజ్జయినిగా మారినది.దాని యందు మహాకాలుడుగా  అయ్యవారు,మహాకాళి గా అమ్మవారు ఆరాద్గింపబడుదురు.ఈ క్షేత్రమును మహా శ్మశానవాటిక అనికూడా అంటారు.అమ్మవారు రౌద్రరూపిగా పుర్రెలను మొలకు వస్త్రములుగా ధరిస్తుంది.కాలము ప్రళయస్...