PURUHOOTIKAA PEETHIKAAPURAE

"పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి" మాయాసతి పీఠికాభాగము పడిన ఆంధ్ర ప్రదేశములోని పవిత్ర స్థలమును "పీఠికాపురము" అనియు,పిఠాపురము అనియు,పిష్ఠపురము అనియు,పాదగయ అనియు భావిస్తూ,భజిస్తూ ఉంటారు.పీఠికాపురి పాలిని "పీఠాంబ" అని నమ్ముతారు.ఆ తల్లి ఒక చేతిలో బంగారు పాత్ర,వేరొక చేత బాగుగా పండిన ఉసిరికాయ,మరొక చేత త్రిశూలము,నాల్గవ చేత లోహదండమును ధరించి నేత్రోత్సవము చేసెడిదట.వృతాసుర సంహార దోషమును తొలగించుకొనుటకు ఇంద్రుడు అమ్మగురించి అత్యంత నియమ నిష్ఠలతో తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట అమ్మ సంతసింసించి ఇంద్రుని మరొక పేరైన (పురుహూతుడు)పురుహూతిక నామమును స్వీకరించి,ఆశీర్వదించినదట. హుంకారిణి శక్తిపీఠ్ముగా ప్రసిద్ధిచెందిన స్థలములో వెలిసిన తల్లిని " ఓంకారిణి" అని కూడా పిలుస్తారు. ఇంద్రునిచే నిర్మింపబడిన పంచ మాధవక్షేత్రములలో ఒకటైన "కుంతీ మాధ క్షేత్రము" ఇక్కడ కలదు.పిఠాపురమునకు ఉత్తరదిక్కున "ఏలేరూఅనే ఏరు ఒకటి ఉంది.దీనిని ప్రస్తుతము చెరుకుల కాలువ అని పిలుస్తున్నారు రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడ...