NAH PRAYACHCHAMTI SAUKHYAM-11

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-10
  *****************************

   భగవంతుడు-భక్తుడు ఇద్దరుసేనాపతులే-అన్నదానప్రియులే.

 " నమో బభ్లుశాయనివ్యాధినే అన్నానాం పతయే నమః."

  పరమేశ్వరుడు వృషభవాహనుడు.వృషభము ధర్మము.దుక్కిదున్ని దుర్భిక్షమును పోగొట్టును." నమో మేఘ్యాయచ" మేఘస్వరూపముగా స్వామి మారి వాని ద్వారా వర్షములను కురిపించును.హర్షమునందించును." నమో వర్షాయచ."

 " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః."

  మరొకవిశేషము


   తమసేనలకు అన్నమును అందించుటలో అతి విశాలహృదయులు.

ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది

సర్వలోక సేనాపతి సదాశివా నమో నమః..

భక్తుని విషయానికొస్తే,

 తంజావూరు జిల్లాలోని తిరునట్టి యాట్టంగుడి నివాసియైన కోట్పులి నాయనారు.చోలరాజ్య సేనాధిపతి.అతి పరాక్రమ వంతుడగుటచే పెద్దపులి అను పేరుతో ప్రసిధ్ధిపొందాడు.పరాక్రమమునకు తోడుగా పదిమంది కడుపు నింపు ప్రసాదగుణ సంపన్నుడు.





 అన్నము పరబ్రహ్మస్వరూపముగా భావిస్తూ,అన్నదానము అన్ని దానములలో గొప్పదను సామెతను గౌరవిస్తూ,అన్నపూర్ణేశ్వరుని అమితభక్తితో కొలిచే నాయనారు.తన శక్తి వంచన గాకుండా శివాలయములకు ధాన్యరాశులను పంపించుతు,స్వామి ప్రసాదమును సర్వజీవులు స్వీకరించుటలో శివుని దర్శించి,పులకరించేవాడు.

 భవతి అస్మిన్ సర్వం అను భావన కలిగి " నమో భవాయచ రుద్రాయచ" అని స్మరిర్స్తు అమితానందమును పొందుచుండెడి వాడు.








వ్యాస మహర్షిని సైతము కుపితునిచేసిన అన్నలేమి, కలుగకుండ చూడమని అన్నపూర్ణేశ్వరుని

 " ద్రాపే అంధసస్పతే" నమో నమః."





అనుచు నిరంతర శివనామ స్మరణతో-శివప్రసాద వితరణతో అహోరాత్రములు మహదానందముగా సాగుచున్నవి. స్వకార్య నిర్వహణ స్వామికార్య నిర్వహణకు కించిత్ ఆటంకమును కలిగించినది.

" నమశ్శ్రుతాయచ-శ్రుత సేనాయచ " తన సేనానికి రాజకార్య నిమిత్తము పొరుగూరికి వెళ్లవలసిన పని కల్పించాడు.కథను ముందుకు నడిపించేవి కాలాతీతును లీలలే కదా.కాఠిన్యరూపాలు-కారుణ్య సంద్రాలు.
రాజాజ్ఞను పాలించుటకు ఊరువదిలి పొరుగూరు వెళ్ళవలసినపరిస్థితి ఏర్పడింది నాయనారుకు.

"మృడానో రుద్రో" రుద్రదేవా ఈ లోకమున ధనధాన్యములను సమృద్ధిగా నిచ్చి మమ్ము పాలింపుము అను భక్తుల భోజనమునకై సరిపడు ధాన్యపు రాశులను శివాలయములకు పంపించమని,తనబంధువులకు ఆదేశించి కార్యోన్ముఖుడాయెను కోట్పులి.









" నమః గృత్యేభ్యో గృత్స పతిభ్యశ్చవో నమః"

  ఉభయనమస్కార గ్రహీత అయిన శివుడు దురాశాపరుల నాయకుడిగా ,కోట్పలి బంధువులను మార్చి,ధాన్యమును అన్నదానమునకు అందీయక తామె భుజించసాగారు.కారణము మన స్వామి లీలయే.



' నమో వర్షాయచ-అవర్షాయచ." వర్షము-వర్షాభావము రెండును తానే అయిన లోకహర్షుడు,నాయనారు సేనానిగా యుధ్ధమునకు పొరుగూరు వెళ్ళిన సమయమున, కాలభీకరుడై కరువురక్కసి కోరలుసాచి ధాన్యమునుదక్కనీయలేదు.బంధువులు తమను తాము బతికించుకొనుటకై శివాలయమునకు పంపవల్సిన ధాన్యమును తామే భుజింపసాగిరి.మిగిలినధాన్యమును పంపక తమకొరకే దాచుకొని,నాయనారు ఆజ్ఞను తిరస్కరించిరి.

  " శివ నామము-శివ ధ్యానము-శివ స్మరణము-శివార్చనము-శివప్రసాద వితరణము
. అను శివవ్రతమునకు భంగము వాటిల్లినది.విజేయుడై వెనుకకు వచ్చినాడు
 నాయనారు

." నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే నమః".
సేనాపతి రూపముననున్నరుద్రునకు నమస్కారము.

 "నమో ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరఘొర రూపేభ్యః "

తిరిగి వచ్చిన నాయనారు బంధువుల వలన జరిగినతప్పిదమునుతెలుసుకొని మిక్కిలిచింతించినాడు.నిర్వికార నిరంజనుని ఘోర-అఘోర ( శాంత) రూపములు జీవులు చేసికొనిన కర్మ ఫలితములు కాని అన్యములు కావు.నాయనారు బంధువుల పాపకర్మక్షయము ఘోర రూపుడైన కోట్పులి చేతిలో నున్నదా యన్నట్లు కుపితుడై నైవేద్యము కానీయక భుజించిన వారినందరిని " భవత్య హేత్యై" వంటి కత్తితో వారి పాపములను అంతమొందించినాడు

."పాపం శమయతి సర్వాణి." లోకవిదితమైనది కోట్పలి శివభక్తి.ఉగ్రాయచ భీమాయచ-శంగాయచ పశుపతియేచ అయినాడు.స్వామిలీలలు సదా స్మరణములు వారినందరిని పునీతులను చేయుటయే కాక పునర్జీవితులను చేసెను.

 పాపపరిహారము చేయు పరమేశ్వరుని ప్రార్థిస్తూ,


.











 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

 ( ఏక బిల్వం శివార్పణం.)











Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)