KADAA TVAAM PASYAEM-01


    
   కదా త్వాంపశ్యేయం-01
   **********************
 " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.

   నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".
  ప్రపంచ పదార్థములను గుర్తించగలిగి-ప్రకటించకలగటమును ఐహిక జ్ఞానముగాను,అవ్యక్త చైతన్య ఉనికిని గుర్తించి-దర్శించి ధన్యత చెందగలిగేది ఆధ్యాత్మిక జ్ఞానము.అదిలేనిది అజ్ఞానము.ఒక వస్తువును మరొకటిగా భావించి-భాషించుట అన్యథా జ్ఞానము.అన్యథా జ్ఞానము అజ్ఞానము కన్న అనర్థదాయకమని దానిని తొలగించుకొనుట అతి కష్టమని పెద్దలు అనుభవముతో చెబుతారు.

 ఈనాటి బిల్వార్చనము లో సదాశివుడు,
    మనకు అజ్ఞానమును-అన్యథా జ్ఞానమును పరిచయము చేస్తూ పదములను కదిలిస్తున్నాడు  రెండు ఆట బొమ్మలతో మాట్లాడిస్తూ..నమామి పరమేశ్వరా.



   అటుగా వెళుతున్న  శంకరయ్య-శివయ్యలకు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటూ-వారు పోట్లాడుకుంటున్నారా అనిపించేటట్లు కనిపించారు.చాలా సేపటికిందనే  వాదన ప్రారంభమైనట్లున్నది.గొంతులు రాచుకుంటున్నాయి.మధ్యలో ఆపి దాహమును తీర్చుకుంటున్నారు.కండువాతో నుదుటిమీద పట్టిన తుడుచుకుంటున్నారు.కాని,

 ఎవరు వెనుకకు తగ్గటములేదు.ఎదుటివారి మాటను అంగీకరించుట లేదు.ఏమైనదా అని ఆరా తీస్తే,



   వారిద్దరికి ఒక వస్తువు కనిపించింది తళతళమెరుస్తూ.

 వెండిముక్క అంటున్నాడు ఒకడు.

 కాదు  గాజుముక్క అంటున్నాడు మరొకడు.

 

 అంతటితో ఆగక మొదటివాడు నీవు చూసిన వస్తువును గుర్తుపట్టలేకపోతున్నావు  అంటూ

 తన పక్క నున్న మరొక   దానిని చూపిస్తూ ఇప్పుడు చెప్పు ఇది ఏమిటి? అని అడిగాడు.దానికి రెండవ వాడు ఓ! నాకు తెలుసు. ఇది ,మణి అన్నాడు నిశ్చయముగా.మణికాదు ఇది రాయి.మన పక్కనే ఉన్నది కదా అన్నాడు 

 మణి అంటున్నాడు ఒకడు.

 కాదు రాయి అంటున్నాడు మరొకడు.

 తన మాటను రూఢి చేయాలని సూర్యకిరణ కాంతిపడి మెరుస్తున్నది అది మణికాదు అంటున్నాడు.
 
 కానేకాదని తలను అడ్దంగా తిప్పుతున్నాడు అలిసిపోయి. 

  అదేదారిలో ఒక విప్రుడు,

 "యథా బుద్ధిశ్శుక్తా రజతమితి కాచష్మకమణిః

  జలేపైష్టీక్షీరం భవతి మృగతృష్ణాతు  సలిలం

  తథా "దేవభ్రాంత్యా" భజతి భవదన్యం జడజనం

  మహాదేవేశ త్వాం మనసిచ నమత్వా పశుపతే."

 

  అదే సమయములో ఒక కారు సైతము  హారను శబ్దము చేస్తూ అటుగా వెళ్ళింది.



 


 " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.

   నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".







  మనకు అజ్ఞానమును-అన్యథా జ్ఞానమును పరిచయము చేస్తూ పదములను కదిలిస్తున్నాడు పరమేశ్వరుడు రెండు ఆట బొమ్మలతో మాట్లాడిస్తూ..నమామి పరమేశ్వరా.



 అటుగా వెళుతున్న  శంకరయ్య-శివయ్యలకు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటూ-వారు పోట్లాడుకుంటున్నారా అనిపించేటట్లు కనిపించారు.చాలా సేపటికిందనే  వాదన ప్రారంభమైనట్లున్నది.గొంతులు రాచుకుంటున్నాయి.మధ్యలో ఆపి దాహమును తీర్చుకుంటున్నారు.కండువాతో నుదుటిమీద పట్తిన చెమటను తుడుచుకుంటున్నారు.కాని,

 ఎవరు వెనుకకు తగ్గటములేదు.ఎదుటివారి మాటను అంగీకరించుట లేదు.ఏమైనదా అని ఆరా తీస్తే,



   వారిద్దరికి ఒక వస్తువు కనిపించింది తళతళమెరుస్తూ.

 వెండిముక్క అంటున్నాడు ఒకడు.

 కాదు  గాజుముక్క అంటున్నాడు మరొకడు.

 

 అంతటితో ఆగక మొదటివాడు నీవు చూసిన వస్తువును గుర్తుపట్తలేక యున్నావు అంటూ

 తన పక్క నున్న  దానిని చూపిస్తూ ఇప్పుడు చెప్పు ఇది ఏమిటి? అని అడిగాడు.దానికి రెండవ వాడు ఓ నాకు తెలుసు ఇది మణి అన్నాడు నిశ్చయముగా.మణికాదు ఇది రాయి.మన పక్కనే ఉన్నది కదా అన్నాడు 

 మణి అంటున్నాడు ఒకడు.

 కాదు రాయి అంటున్నాడు మరొకడు.

 తన మాటను రూఢి చేయాలని సూర్యకిరణ కాంతిపడి మెరుస్తున్నది అది మణికాదు అంటున్నాడు.

 కానేకాదని తలనూడ్దంగా తిప్పుతున్నాడు అలిసిపోయి. 







 అదేదారిలో ఒక విప్రుడు,

 "యథా బుద్ధిశ్శుక్తా రజతమితి కాచష్మకమణిః

  జలేపైష్టీక్షీరం భవతి మృగత్రుష్ణాతు సలిలం

  తథా "దేవభ్రాంత్యా" భజతి భవదన్యంజడజనం

  మహాదేవేశ త్వాం మనసిచ నమత్వా పశుపతే."

 

  అదే సమయములో ఒక కారు సైతము  హారను శబ్దము చేస్తూ అటుగా వెళ్ళింది.



 "మనము అణువంత పరతత్త్వమును అర్థము చేసుకునే లోపుగా  ఆకాశమంత మాయను కప్పేస్తుంటాడు ఆ అడ్డనామాలవాడు".



  శంకరయ్యకు ఒకచక్కటి ఆలోచన తళుక్కున మెరిసింది.శివయ్యకు ఆ శ్లోక భావమునుచెప్పి,వివరముగా చెప్పి,వెనుకకు పంపించాలనిపించింది.

 శివయ్యా మనము కాసేపు ఆ రచ్చబండ మీద విశ్రాంతి తీసుకుని మన ప్రయాణమును చేద్దాము.

  చిరునవ్వుతో తలపంకించాడు శివయ్య."తనకు కావలిసినదికూడా అదేగా".

 అమాయకముగా   వచ్చి కూర్చున్నాడు పక్కన.

 ఆ విప్రుడు చదివిన శ్లోకము అర్థము -మనము చూసిన వారి చేష్టలు ఒక్కటిగా లేవూ అని ఉత్సాహముగా   అన్నాడు

శంకరయ్య.

  నాకు సదువురాదుకదా.అర్థమవ్వలేదు.వారేమో ఒకటే వస్తువును పట్టుకుని దాని పేరు తెలియక కొట్లాడుకుంటున్నారు అన్నాడు  మరింత అమాయకముగా.
  నేను నీకు అర్థము అయ్యేలా చెబుతాను.కంగారుపడి దూరంజరుగకు.నీకు  కనుక భావం బోధ పడిందా మన కథ అడ్దం తిరగటంఖాయం అంటూ,గొంతును సవరించుకుని,గంభీరముగా

 1.జడజనః-(చైతన్యమును దుర్తించలేని) మూర్ఖ జనులు

 2.భ్రాంత్యా-భ్రమలో ఉన్నారయ్యా.

    అంటే దగ్గరగా జరిగి మరీ అడిగాడు శివయ్య.

 అంటే,నేను నీతో చెప్పానే దేవుడు లేడనేవిషయము

  కాని ఉన్నాడని అందరు అనుకుంటున్నారని,వానిని 

3,నమత్వా-నిజమని/ఉన్నాడని తలుస్తూ

4.భజతి-భజిస్తున్నారు.

   లేనివాడిని ఉన్నాడనుకొని భజిస్తున్నారు ఈ మూర్ఖ జనులు.నీతోపాటు వారికి త్వరలోనే కనువిప్పు కలుగుతుందిలే

  మనసులోనే నవ్వుకున్నాడు మహాదేవుడు.

'యథా బుద్ధిః భవతి-తథా భాష్యతి ఇంద్రియం"

 అయితే నేను మా ఊరికి తిరిగి వెళ్ళిపోనా అని శివయ్య అంటుండగానే ,

 శ్లోకం చదువుతూ వెళ్ళిన విప్రుడు తన పక్కనున్న వానికి అన్యదేవతాం భజతి అని చెబుతూ వెళుతున్నాడు.
 
 విన్న శంకరయ్య  ఖంగుతున్నాడు.అంటే-అంటే ఆ మోసగాడు వాడొక్కడే కాదా?ఇంకా చాలామందిని తన జట్టులో కలుపుకున్నాడా ఇందాక ఈ దేవశబ్దము నాకు వినబడలేదే ,గొణుగుకుంటున్న శంకరయ్యను మరింత మురిపెముగా చూస్తూ ,ఆ కారు హారను శబ్దము కారణమేమొనండి అన్నాడు అమాయకముగా.శివయ్య,

 "నీలోని నామీద కోపం 
  వెలుగనీయదు జ్ఞానదీపం" 
    అంతలోనే తేరుకుని,

    శివయ్యా ఎంతమంది ఉన్నాసరే నా ప్రయత్నము ఆపను.ప్రయాణము ఆపను.వాడు నా కళ్లపడేవరకు,ఎప్పుడు చూస్తానో,
  " కదా   త్వాంపశ్యేయం" అని  అంటున్న శంకరయ్య ఏమిచేస్తాడో-శివయ్య ఏమిచేయించ దలిచాడో రేపటి బిల్వార్చనలో తెలుసుకుందాము.

 'తన్మై మనః శివ సంకల్పమస్తు

  వాచే మమశివపంచాక్షరస్తు

  మనసే మమ శివభావాత్మ మస్తు".

   కదిలేవికథలు-కదలనిది కరుణ.

    పాహిమాం పరమేశ్వరా.



    (ఏక బిల్వం  శివార్పణం) 

  

  

  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)