PADISAKTULA PARAMAARTHAMU-edAVAsAKTI-DHOOMAVATI.

 పదిశక్తుల పరమార్థము- ఏడవశక్తి-ధూమవతి.
 ***********************************

 " ఏకం సత్ " విప్రా బహుదా వదంతి.

   ఒకే పరమాత్మ.విప్రులు అనగా ఒక కులము అనికాదు.విశేష పాండిత్యము గలవారు.వారు తమ జ్ఞానమునకు బుధ్ధిని జోడించి అమ్మదయతో దాని స్వరూప-స్వభావములను తమదైన రీతిలో మనకు అందిస్తున్నారు.

  ధూమవతి తల్లి ఏకంసత్ కనుకజీవిపుట్టుక ముందు మరణము తరువాత స్థితి అంటున్నారు.జనన మరణములు రెండు మానవప్రవృత్తులు.త్యజించవలసిని తనువు గలిగినవన్నీ (మరణించవలసిన) మానవులే సకలజీవరాశులు.

   గుర్రము లేని రథము లో తల్లి కూర్చుంటుంది.అంటే మనసనే పరుగులు దానిని నియంత్రించవలసిన పగ్గములు అవసరములేనిది.స్థితి-గతులకు అతీతమైన సమాధిస్థితి.

  అసురుల పచ్చిమాస భక్షణము మనలో అసురీభావములను మొగ్గలోనే తుంచివేయు కారుణ్యము.

   తల్లిచేతిలోని చేటతో తేలిపోవు ఇహములను పొట్టును చెరిగివేసి,శాశ్వతాన0దము మనకు చేటలో చూపించుట.చెరుగుట నిత్య-నిశ్చల సాధన అను క్రియాశీలత.

  దాగి ఉన్న నిప్పును పరిచయము చేసేది పొగ..అదే ఈ తల్లి తత్త్వము.స్వయం ప్రకాశక తల్లి మనముందు మాయ అనే పొగను మనముందుంచుతుంది.పొగ వాయు సహాయముతో మంటగా మారి ద్యోతకమగునట్లు,నిశ్చలమను పొగగొట్టమును పట్టుకొని నిరంతర సాధన అను గాలిని ప0పుతుంటే పొగ తన రూపును మార్చుకొని అగ్నిని చూపిస్తుంది.అదే విధముగా ధూమవతి పొగచే కప్పబడినట్లు కనిపిస్తు,దానికి మూలమైన అగ్నిని మూలశక్తిని (బిందువును) చూపించటానికి సహాయపడుతుంది.

  అమ్మ దయతో ఈ రోజు మనము తత్త్వము అర్థము చేసికొనుటకు ప్రయత్నిద్దాము.

  ధూమవతి తల్లిమనకు అద్వయము-అఖండము-అనంతము అను మూడు   ముఖ్యాంశములకు తానేఉదాహరణగా మారి వివరించుచున్నది.ద్వైత భావనిర్మూలనము  కలిగిస్తున్నది.

1.అద్వయము
  *******
 నిజమునకు సుందరము-వికారము అను రెండు రూపములు లేవు.డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్- అట్టను చూసి పుస్తక విలువను తెలుసుకోలేవు.కాకి-ముసలితనము-పొగ రంగు అన్ని బాహ్యములే.హంస-పడుచు-బంగరు మేని రంగు వేరుగా తోచుచున్నప్పటికిని వాటిలోని ప్రాణశక్తి ఒకటే.తారతమ్యములు లేనిది.జ్ఞాన చక్షువు తెరిచిచూస్తే కానరావు వికారములు.

 2.అఖండము.
***********

  ప్రారంభములో మనము ఏకానేక రూపములు దేవి క్రీడలు అని చెప్పుకున్నాము.పరాశక్తి తనను తాను రెండురూపములుగా విభజించుకొని,వాటికి స్త్రీ-పురుష రూపములుగా ప్రకటించినది.ఉదాహరణకు కాళి-కాళుడు.ఇది సత్యమైనపుడు గౌరి తనకు ఆకలివేసినదని,శివుని మింగివేసినదని,పురుష సంపర్కము లేని స్త్రీమూర్తి కనుక విధవ గా భావించుటకు కారణము మన అవగాహన లోపమే కాని అన్యము కాదు.తంతు అనగా దారము లేక బంధము.సర్వమంగళ తన లీలగ తననుండి తాను వేరుచేసిన శివరూపమును తనలో కలిపివేసి అఖండము చేసినది.ఈ ప్రక్రియలో ఏది అశుభము? ఎవరు వితంతువు?ద్వంద్వము నిర్ద్వంద్వమైనది అంతే.

3.మూడవ పాఠము ఆవరణ-నిక్షేపము

  మొదటిది దాచివేయుట.ఉదాహరణకు మర్రిచెట్టి రూపమును విత్తులో దాచినట్లు తల్లి తన సర్వ మంగళరూపమును ధూమవతి రూపములో దాచినది.సమయమాసన్నమైనపుడు విత్తు చెట్టుగా మారినట్లు తల్లి పెద్దముత్తైదువుగా మనలకు దర్శనమిస్తుంది.

  మనకు ఏకత్వ పరిజ్ఞానమును కలిగించుటకు సోదాహరణమైన ధూమవతి చరణారవిందార్పణమస్తు.







Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)