CHAKRESVARI-PARICHAYAMU

 


 " కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం

   మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం

   దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం

   త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే."


   శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై,

 మహత్తు-అహంకారము

 శివశక్తులు

 స్థావర-జంగమము

 ప్రకృతి-పురుషులు గా

  ప్రకటింపబడుతూ,

  పంచకృత్యాసక్తులై,


 పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి,

మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను

మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను


మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి

మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను

మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది.

 ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది.

  సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది.

 త్రిపురాను ఉపసర్గనుపొందిన,

 1.త్రిపుర

 2.త్రిపుర+ఈశి

 3.త్రిపుర+సుందరి

 4.త్రిపుర+వాసిని

 5.త్రిపురా+శ్రీ

 6.త్రిపుర+మాలిని

 7.త్రిపుర+సిద్ధే

 8.త్రిపుర+అంబే

      9.మహా త్రిపుర సుందరిగా,

   చక్రేశ్వరులై సాధకుని సహాయపడుతుంటారు.ఆవరననుండి నిష్క్రమించునపుడు చక్రేశ్వరికి నమస్కారముచేసి,మరొక ఆవరనము లోనికి ప్రవేశించుట సంప్రదాయము.

  భూపురమునందు మూడు పురముల ప్రసక్తి వచ్చింది.

  సులభమైన భాషలోసూటిగా చెప్పలంటే "ఆత్మ అనే సుందర చైతన్యము"స్థూల-సూక్ష్మ-కారన సరీరములను మూడింటిని కప్పుకుని యున్నది.

  ఆత్మచైతన్యమే త్రిపుర సుందరి.ఆ చైతన్యము పరిపాలించువేళ త్రిపురేశి,సుందరముగా మలచువేళ త్రిపురసుందరి,అంతర్వాసినియైనవేళ త్రిపురవాసిని,సౌభాగ్యననుగ్రహించువేళ త్రిపురాశ్రీ,సర్వ వ్యాపకమైనవేళ త్రిపురమాలిని,వ్యక్తీకరింపబడుచున్నవేళ త్రిపురసిద్ధే,జగన్మాత కనుక త్రిపురాంబే,

 అమ్మలకన్న అమ్మకనుక "మహాత్రిపురసుందరి"గా

 భావించి,దర్శించి ధన్యులగువారెందరో.

    శ్రీ  మాత్రే నమః


 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)