TANOYU NAH SIVAH SIVAM-24@SIVATANDAVASTOTRAMU
" వాగర్థావివ సంవృకౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"
కథానుసారముగా ,
లలాట చత్వర శ్లోకములో "నః" అంటూ నమస్కారముతో భక్తికి బీజమువేసినాడు పరమేశ్వరుడు.
కరాళఫాల పట్టిక శ్లోకములో ఆ భక్తి బీజము మొలకెత్తి మతిః మమ -ఆనమస్కారము మతిర్మమ-మనస్పూర్తిగాచేయునది కావాలనిపించాడు.అప్పుడు ఆ నమస్కారము కేవలము ఆంగికము కాదు.మనసును కలుపుకొనిన మానసిక-ఆంగికమైనది.ఆ నమస్కారము స్వామిని శ్రియం జగస్షురంధరునిగా దర్శింపచేస్తున్నది మొలకమొక్కగా మారి.
ఏమిటి ఆ జగద్ధురంధరత్వము అను ఆలోచనమును రేకెత్తించినది.ద్వంద్వములను వేరువేరుగా చూపిస్తున్నది ఆ మొక్క వేసిన మొగ్గ. మొగ్గ పువ్వుగా పరిమళములు చిందుతూ స్వామి ద్వంద్వములను వేరువేరుగా చూపుటయే కాదు నీ మీది అనుగ్రహముతో వాటిని అంతమొందించి నీకు న-ద్వైత ఏకం సత్ అని తెలియచేస్తూ,ఫలవంతమై నీ భజనమునకుమరింత మెరుగులు దిద్దుచున్నది.ప్రపంచ కాలిమత్వము ప్రకాశత్వమును
"దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజో
గరిష్ఠ రత్నలోష్ఠయో సుహృద్విపక్ష యోః
తృషారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో
సమం ప్రవర్త యన్మనః "కదా" సదాశివం భజామ్యహం."
కదా-అప్పుడో నేను
సమప్రవృత్తితో ఆసదాశివుని భజించగలిగేది బాహ్యస్మృతిని మరచి,వవక్షను వీడి.
కామముతో ప్రారంభమయిన రావణుడు,క్రోధముతో కైలాసమును ఎత్తబోయి,ఆత్మలింగమును ఒకవేళ స్వామి ప్రసాదించినను ఎవరైనా దానిని తన నుండి గ్రహించివేస్తారో అను లోభముతో,బలముతో సాధించగలనన్న్ మదముతో,స్వామి వరమును కోరుకొమ్మనిన వేళ అమ్మ మీది మోహముతో,నందీశ్వరునిపై మాత్సర్యముతో నున్న రావణుని స్వామీనుగ్రహము సమవర్తిత్వ భజనమును కోరుకొనునట్లు అనుగ్రహించినది. పొంది సదాశివుని దయతో సమవర్త ప్రకృతితో సదాశివుని భజనమును కోరుచున్నది.
Comments
Post a Comment