ALO REMBAVAY-15









  పదిహేనవ పాశురము.


  *******************




 ఎల్లే! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో


 శెల్లెన్మ్రాళే యే మిన్ నంగవీర్ పోదాగిన్రే


  


 వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్వాయ్ అరిదుం


 వల్లీర్గళ్ నీంగళే నానేతాన్ ఆ ఇడుగ




 ఒల్లై నీ పోదాయ్  ఉనక్కెన్న వేరుడయై


 ఎల్లారుం పోందారో పోందార్ పో ఎణ్ణిక్కుళ్




 వల్లానై కొన్రానై మాట్రారై మాట్రళిక్క


 వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్.




 




 ఓం నమో భగవతే వాసుదేవాయ.


 ******************************


 ఈ పాశురమును వేదవిదులు" తిరుప్పావాయిలం తిరుప్పావై" గా కీర్తిస్తారు.




 గోదమ్మ ఈ పాశురములములో మూడు విషయములను ప్రస్తావిస్తు,మూలతత్త్వమును వివరిస్తు,ముముక్షత్వానికి మార్గము చూపిస్తున్నది.కనుకనే ఈ పాశురమును" పరమాద్భుతమా" అంటు ప్రారంభించినది.




 ఎల్లే!- ఎంత ఆశ్చర్యము పరమాద్భుతము అని తన చిలుకను గురించి(మన గోపికను) ప్రస్తావించుచున్నది.




  ఇళ్ళంగిళియే-లేత చిలుకా! అంటు మన గోపికను సంబోధించినది.




   ఇక్కడ మనమొక సంఘటనను ముచ్చటించుకుందాము.




 చిలుక తనంత తానుగా ఏమియును నేర్వలేనిది కాని పరమాత్మచే చక్కని (సాధనమార్గమును) వాక్ అనే ఇంద్రియమును ప్రసాదింపబడినది.




  గోదమ్మ తన పెంపుడు చిలుకకు గోవింద-గోవింద అను గోవింద నామమును పలుకుట నేర్పించినది.అదియును అంతే శ్రధ్ధా భక్తులతో నేర్చుకున్నది.అప్పుడు గోదమ్మ దానితో నీవు ఎల్లప్పుడును నిర్విరామముగా-నిశ్చలముగా నామసంకీర్తనమును చేస్తూనే ఉండు.అది నాకెంతో ఇష్టము అని చెప్పినది.చిలుక క్రమమును తప్పక కీర్తిస్తూనే ఉంది.




కాని ఒకనాడు స్వామి విరహవేదనతో అన్యమనస్క్యై చిలుక నామ సంకీర్తనమునకు ఆగ్రహించి దానిని మౌనముగా ఉండమన్నది.కాని అది వినలేదు.తనపాటికి తాను తన్మయముతో గోవింద నామములను కీర్తిస్తూనే ఉంది.ఎందుకంటే దానికి బాహ్య విషయములతో గాని-వాటి ప్రభావములతో గాని సంబంధము లేదు.ఆ దశను ఎప్పుడోఅధిగమించేసినది.




 మన గోపిక కూడ అదే స్థితిలో ఆనందిస్తుంటుంది.




 మనము చిలుకలమే.కాని సంసారమనే పంజరములో బంధింపబడి ఉన్నాము.అస్వతంత్రులము.కనుకనే అమ్మ,




  ఇన్నం ఉరంగుదియో?ఇంకను మేల్కొనలేద?




  ప్రతిరాత్రి నిదురించుట-ఉదయమున మేల్కాంచుట-రాత్రి అవగానే తిరిగి నిద్రించుట-అనగా,




  జన్మజన్మల పరంపరలను జ్ఞాన ప్రవృత్తి లేక కొనసాగించుచున్నవారలము.కనుక,




 మేల్కొని వ్రతమునకు రండి అని పిలుచుచునది.




  మాటే మంత్రము అన్న పవిత్రముగా మన వాక్కులను సద్వినియోగ పరచుకోవాలి అను విషయమును,వాదనలను వదిలివేద్దాము అని గోపిక చేత చెప్పకనే చెప్పించుచున్నది.






  శెల్లాన్రు-పరుష వాక్యములను/నిందా వాక్యములను


  ఆళయేన్-పలుకవద్దు.


  


  మీరు,(బయటనున్న గోపికలు)




   నీంగళ్ వల్లీర్గళ్-వాక్చాతుర్యమును

 పొందినవారు-వాచక అర్థము.





  సర్వ సర్వజ్ఞులు-సమస్తమును తెలుసుకున్నవారు-అంతరార్థము.కనుక,




 నాపై నిందలను మోపకండి అని అన్నది.




   లోపల నున్న గోపిక అలా ఎందుకన్నది? అంటే అంతకు ముందు ఆమె వారితో ఏదో చెప్పబోతుందగా,చాలు-చాలు,




   వల్లై-ఓ చమత్కార గోపిక,


  నీవు చెప్పే,


  కట్టురైకల్-కట్టుకథలు,


  ఆరిదుం-మాకు తెలుసు.మేము మునుపు ఎన్నో విన్నాము అన్నారు..ఇది బాహ్యమునకు కనిపించు అభియోగము.





  నిజమునకు తల్లీ నీవు వినిపించు కట్టుకథలు అనగా కృష్ణుని లీలలు మాకెంతో ఆనంద దాయకములు అనుచున్నారు.ఇది అభిమానము.


  అంతే కాదు అని వాదించలేదు గోపిక.అవును మీరే సరిగా చెప్పుచున్నరు.నేనే మీ దగ్గర ఓడిపోయాను అని అంటున్నది.




  నేనేదాన్-నేనే,ఆ ఇడుగ-ఓడిపోయాను అని అంటున్నది.వారు అంతకు ముందు ఆమెను నోముకు కూడ రాలేనంత పనులు నీకేమున్నాయి? అని దెప్పిపొడిచారు.ఒకవేళ ఉన్నా అవి విషయ సంబంధములే గద అని ఎత్తిపొడిచారు.




  ఉనక్కెన్న వేరుడయై-ఇంకేమి పనులున్నాయి నీకు?




   అయినను మన గోపిక వాదనకు దిగక,అందరు వచ్చేశార? ఒక్కసారి చూడండి అన్నది.దానికి వారు,



ఎల్లారం పోందారో-అందరము వచ్చేసాము.




 పోందార్పో-వచ్చి నిలబడియున్నాము.




 మా మాటమీద నమ్మకము లేకపోతే వచ్చి,నీ వేలితో మమ్ములను తాకుతు,


 ఎణ్ణిక్కుళ్-లెక్కించు అన్నారు.( ఆచార్య స్పర్శానుగ్రహమును కోరుచున్నవారు)




   ఒల్లె-త్వరగా,


   నీ పోదాయ్-నీవు రమ్ము అని అంటుండగానే ఆమె బయటకు వచ్చి,ఈ రోజు స్వామి లీలలో దేనిని కీర్తిస్తు వెళదాము అంటే,

 వల్ల-పరక్రమవంతమైన 

 అలనై-ఏనుగును





   వల్లానై మాయనై-అంటు ప్రారంభించినది.


 మొదటిది-మదించిన ఏనుగు.


   రెండవసారి అన్నప్పుడు మదించిన మన ఇంద్రియములు.

.




 ఎల్లే!-ఎంతటి పరమాద్భుతమాలీల.





  అదే కువలయ పీడనము.


 స్వామి కువలయమనే పరాక్రమమైన ఏనుగును వధించి,దాని బాధను గోకులమునకు పోగొట్టినాడట.ఇది కథ.




 కాని కు-చెడు,వలయములు-ఆలోచనలు.




   చెడు ఆలోచనలను కలిగించునవి ఇంద్రియములు.నిజమునకు మన ఇంద్రియములు సర్వసమర్థవంతములు కావు.వాటికి నిర్దేశింపబడిన పరిమిత శక్తివంతములు.నిజమునకు కన్ను వినలేదు-చెవి చూడలేదు.అయినప్పటికిని అవి మహ బలపరాక్రమవంతములని భ్రమలో నుండి వాదనలను యుధ్ధములను గెలుపు తమదే నన్న నమ్మకముతో చేస్తూనే ఉంటాయి.






ఏ విధముగా కువలయము యొక్క దంతమే దాని అంతమునకు కారణమైనదో,అదే విధముగా భగవత్ప్రసాదములైన ఇంద్రియ దుర్వినియోగమే వినాశ హేతువు.దాని నియంత్రణయే ధ్యానము అను చక్కని సందేశమునిచ్చి,పది ఇంద్రియములను జయింపచేసిన స్థితిలో నున్న గోపికలతో నోమునకు వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.





   ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.







  








  


 


 


  




  

 

 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)