TANOTU NAH SIVAH SIVAM-19@ SIVATANDAVASTOTRAMU

 

 వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
  జగతహ్ పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ.

  కథా పరముగా మహాదేవుని నీలకంథరము ప్రళయానంతర సృష్టివికసనమునకు సంకేతముగా చైతన్య/చల్లదనపు కాంతులతో మనలను స్వామి కరుణకు మరింత చేరువచేస్తున్నది.


 " ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలిమప్రభా
   వలంబి కంఠకంథలీ రుచిప్రబద్ధకంథరం
   స్మరఛ్చిదం పురఛ్చిదం భవఛిదం మఖఛ్చిదం
   గజఛ్చిదాంధకఛ్చిదం  తమంతకఛ్చిదం "భజే"


  కథాపరముగాసర్వమంగళ తనశక్తులనన్నింటిని/కళలనన్నింటిని పుష్పగుత్తిగా/కదంబమంజరిగా మలచినది.ఆ చేతిలో విరిసినపుష్పములు తమ మహిమలనే పరిమళములను ప్రసరిస్తూ/ప్రకాశిస్తూ పరమేశ్వరునికి భక్తి అనే మకరందమును నైవేద్యముగా సమర్పించుకొనుటకు పరుగులిడుచునవి.స్వామి పరమప్రీతితో తననుతాను మధుపముగా మలచుకుని మధువ్రతమునకు సిద్ధపడినాడు.కేవలము మకరందమును మాత్రమే స్వీకరించు నియమమును మధువ్రతమంటారు పెద్దలు.

 " అఖర్వ సర్వమంగళా కళాకదంబ మంజరి
   రస ప్రభావమాధురి విఝృంభణా మధువ్రతం
   స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
   గజాంతకాంధకాంతకం తంతకాంతకంభజే"

   మధువును గ్రోలిన మహేశ్వరుడు పూర్వపు శ్లోకములో మనకు వేరుచేసి చూపిన ద్వంద్వ ప్రకృతిని అంతమొందించినాడు.
 ఇప్పుడు నిర్ద్వంద్వ నిర్గుణ నిరంజన నిస్తుల చైతన్యము.
  అట్టి పరమాత్మాద్భుతమును నేను భజిస్తాను.మనందరము భజించుదాము.
  సామవేదము వారు సంస్తుతించినట్లు
 జీవుల పంతలు పండించెను మా శివుడు పెద్దరైతు
 భవ క్షేత్రమున కర్మబీజములు వేసె మొదటి రైతు
   ఏక బిల్వం శివార్పణం.

  ప్రస్తుతభాగములో రెండు ముఖ్యవిషయములు ప్రస్తావింపబడుచున్నవి.
 1.ప్రపంచ కాలిమ ప్రభా
 2.ఏడు ద్వంద్వములనుండి జీవుని వరుచేసి చూపించుచున్న స్వామి భజనముపై ఆకాంక్ష.

   మొదటిరెండు పాదములలో పంచభూతముల సమన్వయమైన ప్రపంచము అవ్యక్త స్థితిలో నున్నది.ఆ అవ్యక్త స్థితి స్వామి శితకంఠముగా ప్రకాశిస్తున్నది.
  శివుని అనుగ్రహము అద్భుతమైనది కనుకనే రావణుడు ఆ అవ్యక్తస్థితి దర్శించగలుగుతున్నాడు.ఆ నల్లనికాంతి యందు రంగులుగుణములు,రేయింబవళ్ళు,సూర్యచంద్రులు,సాగరములు,పర్వతములు,సకలచరాచరములు లీనమై ఉన్నవి.అంటే ప్రళయస్థితి.దానిలోనికి స్వామికరుణ అనేచైతన్య రేఖ ప్రవేశించి,కంఠమును వికసిస్తున్న నల్లకలువగా మారుస్తున్నది.చల్లదనము-చక్కదనము పోటీపడుతూ ద్వంద్వములు క్రమక్రమముగా ప్రకటితమవుతున్నాయి.
  ఎంతటి అద్భుతము.స్వామీనుగ్రహముతో వ్యక్తమగుచున్న ఉపాధులలోనికి ద్వంద్వములు ప్రవేశిస్తున్నాయి.
  మన్మథుడు -త్రిపురములు-పుట్టుకలు-సంసారములు-మదములు-అజ్ఞానములు-తమ జన్మ తాము ఉద్ధరింపబడుటకు కలిగిన ఒక చక్కని అవకాశము అన్న విషయమును పూర్తిగా మరిపింపచేస్తున్నాయి.
   ఈశ్వర నీ కరుణ నన్ను వాటినుండి ఛదించి,వేరుచేసి చూపమని స్వామి అనుగ్రహము భజనముపై ఆసక్తిని కలిగిస్తున్నది.

 స్వామి నన్ను స్మరునీధీనమునుండి స్మరనము వైపునకు,స్థూలసూక్ష్మకారణసరీర తాపత్రయము నుండి,పుట్టుకలనుండి నామ-జప,వాక్-లిఖిత-దాస్య-పాదసేవన యజ్ఞములవైపునకు మరలించుము.ఆ సమయములో కలిగే ఆతంకములకు కారణమైన  నా గజమును/మదమును-అంధకమును/అజ్ఞానమును,తమతకమును-మృత్యుభయమును తొలగునట్లుచేసి,నా ఉపాధిని నిన్నుచేర్చు వాహనముగా మలచుము అని ప్రార్థించుచున్నాడు దశకంఠుడు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)