TANOTU NAH SIVAH SIVAM-20@SIVATANDAVASTOTRAMU
" ఝణ ఝణ ఝణఝణం ఝణిత మథుర శబ్ద సంభరితం
తక తక తకిట తకిట లాస్యతాండవార్పితం
ధిమి ధిమి ధిమి ధిమితహృదయ మర్దన ద్వారం
ఖలు ఖలు ఖలు కణ్విత రుద్రభద్ర చరణరజం
అనుదిన గౌరీశంకర పదాంభోజనివేదితం
(శ్రీ సామవేదం వారి)
ధ్యానం-వచనం-చరణం-పరమపదం-శివపదం.
పరమేశ్వరానుగ్రహము పదేపదే పలుకరిస్తుంటే,
ఎంతటిభాగ్యము, ఆభక్తాగ్రేసరుడు అమ్మనుచూడగలుగుతున్నాడు.తల్లిసర్వమంగళ.అంతేకాదు.దోషములు అసలు లేనేలనిది. ఆ జగజ్జనని తన కళలను సౌరభకుసుమములుగా విరగపూయిస్తూ స్వామిని అనురాగముతో చూస్తున్నది.ఆ శక్తి సృష్టించిన పుష్పముల మహిమలన్నీ మధువుగా మారుతూ మరింత మహదేవుని ఆస్వాదనమునకై ఆహ్వానిస్తున్నాయి.
మహదేవుడు కేవలము మధువును మాత్రమే స్వీకరించే మధూవ్రతి అయినాడు.మధురాతిమధురము ఆ మహదేవునికటాక్షము.
స్తోత్ర ప్రస్తుత భాగము పితరం జగతం వందే పార్వతీ పరమేశ్వరం ను దర్శింపచేస్తున్నది.
మధువు-మధుపము-మధువ్రతము అన్నవి ముఖ్యాంశములు.
అమ్మ సర్వమంగళములను పుష్పమంజరిగా మలచి స్వామికి అందించుచున్నది.
అమ్మశక్తిస్వరూపిణి.అయ్య శివ/సుభస్వరూపుడు.అమ్మ కళలమహిమను స్వామి గ్రహించి మనందరిని ద్వంద్వముల నుండి/రెందవ భాగముగా నున్న,
అరిషడ్వర్గములనుండి ,వాటిని అంతమొందించి యముని సైతము మన దరిచేరనీయని భజన భాగ్యమును కటాక్షించుచున్నాడు.
అంబే శివం మనసా స్మరామి-శిరసా వదామి.
ప్రస్తుత చరణములో స్వామిద్వంద్వములను నీ దయ వేరు-వేరుగా చూపుతూ,నావివేకమును నిన్ను భజించమంటున్నది.
Comments
Post a Comment