TANOTU NAH SIVAH SIVAM-20@SIVATANDAVASTOTRAMU

  

    " ఝణ ఝణ ఝణఝణం ఝణిత మథుర శబ్ద సంభరితం

      తక తక తకిట తకిట లాస్యతాండవార్పితం

      ధిమి ధిమి ధిమి ధిమితహృదయ మర్దన ద్వారం

      ఖలు ఖలు ఖలు కణ్విత రుద్రభద్ర చరణరజం

      అనుదిన గౌరీశంకర  పదాంభోజనివేదితం

         (శ్రీ సామవేదం వారి)

   ధ్యానం-వచనం-చరణం-పరమపదం-శివపదం.


     పరమేశ్వరానుగ్రహము పదేపదే పలుకరిస్తుంటే,


  ఎంతటిభాగ్యము, ఆభక్తాగ్రేసరుడు అమ్మనుచూడగలుగుతున్నాడు.తల్లిసర్వమంగళ.అంతేకాదు.దోషములు అసలు లేనేలనిది. ఆ జగజ్జనని తన కళలను సౌరభకుసుమములుగా విరగపూయిస్తూ స్వామిని అనురాగముతో చూస్తున్నది.ఆ శక్తి సృష్టించిన పుష్పముల మహిమలన్నీ మధువుగా మారుతూ మరింత మహదేవుని ఆస్వాదనమునకై ఆహ్వానిస్తున్నాయి.

 మహదేవుడు కేవలము మధువును మాత్రమే స్వీకరించే మధూవ్రతి అయినాడు.మధురాతిమధురము ఆ మహదేవునికటాక్షము.


   స్తోత్ర ప్రస్తుత భాగము పితరం జగతం వందే పార్వతీ పరమేశ్వరం ను దర్శింపచేస్తున్నది.

మధువు-మధుపము-మధువ్రతము అన్నవి ముఖ్యాంశములు.

 అమ్మ సర్వమంగళములను పుష్పమంజరిగా మలచి స్వామికి అందించుచున్నది.

 అమ్మశక్తిస్వరూపిణి.అయ్య శివ/సుభస్వరూపుడు.అమ్మ కళలమహిమను స్వామి గ్రహించి మనందరిని ద్వంద్వముల నుండి/రెందవ భాగముగా నున్న,

 అరిషడ్వర్గములనుండి ,వాటిని అంతమొందించి యముని సైతము మన దరిచేరనీయని భజన భాగ్యమును కటాక్షించుచున్నాడు.

  అంబే శివం మనసా స్మరామి-శిరసా వదామి.


  

  ప్రస్తుత చరణములో స్వామిద్వంద్వములను నీ దయ వేరు-వేరుగా చూపుతూ,నావివేకమును నిన్ను భజించమంటున్నది.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)