TANOTU NAH SIVAH SIVAM-21@SIVATANDAVASTOTRAMU

    

  " ఆంగికం భువనం యస్య-వాచకం సర్వ వాజ్మయం

    ఆహార్యంచంద్ర తారాది తం  నమః సాత్వికంశివం."


    అమ్మ అందించిన సకల కళల సమాహార మధూను తనివితీర గ్రోలిన స్వామి తాండవమును ప్రారంభించాడట అమ్మ లాస్యమును జతకలుపుతు.

    స్వామి ఒకసారి తనుమరచు ఉప్పొంగు నాట్యమున

    ఒకసారిమరపించు,

    మరచి మరువక ఒకపరి,


   ఓహో హోహో ఊహాతీతంబీ ఆనందము అంటున్నాడు రావణుడు.

 (పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి నమస్కారములతో)


   " స్వామి గలమున నున్న కాళములు ఆశ్చర్యముగా కదులుతు తమ శ్వాసలతో జయత్ జయత్ అంటున్నాయట.ఆ సంభ్రమ నాదమునకు పరవశయైన స్వామి ఫాలనేత్రము పైకుబికి పరవశసిస్తున్నదట.

   ఇది జరుగుచున్న కథ.రావణునికి స్పురించిన దృశ్యము.

    ప్రస్తుత భాగములో రెండు స్వామీనుగ్రహ విశేషములు సంకేతించబడినవి.

   కిందటి భాగములో స్వామిగలము నల్లకలువగా  చల్లదనమునందించుచు ప్రపంచవికసనమునకు నాంది పలికినది.

 స్వామి తాండవము సృస్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్య పరాయనము.స్వామి పదవిన్యాసము ప్రపంచ అవస్థా సంకేతము.మశివుడు 

  దర్శిస్తున్న రావణునికి ఆ తాందవములో అద్భుతమైన అద్వైతము అవగతమగుచున్నది.ఆన్.అంపారవశ్యముతో,

 "హరియె హరుడై లచ్చి అగజాతయై

  సరికిసరి తాందవములాడ

        సకలలోకములు

  హరునిలో హరుచూసి-హరియందు హరుని చూసి

  సర్వమేదినియు అద్వైతమే ప్రతిధ్వనులీన

  హరు చూసి హరినవ్వె-హరుడు హరియై నవ్వె"

    అదియే కదా,

 స్తోత్రములోని,

 ధిమి ధిమి ధిమిధ్వనత్ మృదంగమంగళ ధవ్ని,

 ఆ ధ్వని ప్రవర్తిత ప్రచండ తాండవము.

    విష్ణు మూర్తి తన మద్దెల ధ్వనులతో స్థితికార్యాచరణమును

సంకేతిస్తున్నాడు.స్వామి సహకరిస్తున్నాడు.

   హరిహరాద్వైతంబై అఖిలల్లోకమ్ములు

   ఆనంద డోలికల ఆదమరచి కీర్తించగ

  నటనం ఆడెనె, ఆ పరమ శివుడు నటనా వతంశుడై

  తకధిమి తకధిమి.

 ఏక బిల్వం శివార్పణం




Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)