NA RUDRO RUDRAMARCHAYAET-27(SIVANAMDALAHARI)


 శ్లో : కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధన-పతౌ

గృహస్థే స్వర్భూజా(అ)మర-సురభి-చింతామణి-గణే

శిరస్థే శీతాంశౌ చరణ-యుగలస్థే(అ)ఖిల శుభే

కమ్-అర్థం దాస్యే(అ)హం భవతు భవద్-అర్థం మమ మనః 27


 ప్ర్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు పరమేశ్వరునకు తన మనసును సమర్పిస్తున్నానని అంతకు మించి తాను అర్పించుటకు స్వామి అడుగుటకు వేరేదేమి లేదని స్వామి వైభవమును ప్రస్తుతిస్తున్నారు.నిజమునకు ఇంతకు ముందు ఆశ్లోకౌలలో పలుమారులు మనసు ప్రస్తావన వచ్చినది.

 7.వ శ్లోకములో మనస్తే పాదాబ్జే అంటూ,స్వామి నా మనస్సు నీ పాదపద్మములయందు స్థిరపడియుండునుగాక అన్నారు.

 11.వ శ్లోకములో -యదీయం హృత్పద్మం యది భవదధీనం అంటూ మరొక్కసారి నొక్కిచెప్పారు.

 12.వ శ్లోకములో సైతము "యస్తైవాంతః కరణం అపి శంభో తవ పదే స్థితం" అని మరీ మరీ చెప్పారు.

 అప్పుడు శంకరులవారికి స్వామి అనుగ్రహించిన దర్శనమునకు అతీతముగా ప్రస్తుత శ్లోకములో అనుగ్రహించారేమో అనిపిస్తున్నది.

 ఎందుకంటే స్వామి స్థితికారకత్వమునకు సంకేతములుగా ఏవేవి స్వామిని సేవిస్తున్నాయో సంకీర్తిస్తూ,నిజమునకు అవి స్వామి పాదముల దగ్గర సర్వశుభంకరములుగా సన్నుతింపబడుతున్నాయనటం వెనుక సర్వేశ్వరుని సదనుగ్రహమే కారణమంటున్నారేమో అనిపిస్తున్నది.

   సర్వ శుభములు మన భాషలో చెప్పుకోవాలంటే పాడిపంటలు,ధనధాన్యములు,శాంతిసౌఖ్యములు.

 అవే కదా ఈశ్వరకృపగా ఒక్కొక్క నామరూపములో స్వామిని ఆశ్రయించి అర్చిస్తున్నవి.

 కరస్థే-నికటస్థే-చేతిలో మేరుపర్వతము,సమీపములో కుబేరుడు.

 సర్వశుభములను నిక్షిప్తముచేసుకొనిన సంపద మేరువు.దానిని అందరికి పంచగల సమర్థ కుబేరుడు.పంటలకు సంకేతము కల్పవృక్షము.పాడికి నాడి కామధేనువు.తలచినంత మాత్రముననే సంపదలనీయగలిగినది చింతామణి.నిక్షిప్త-ప్రక్షిప్త సంపదలు సర్వము ఈశ్వర విభూతులే అను మాట నిస్సందేహము.

 సకలసంపద్స్వరూపమైన సదాసేవా నేను నీకేదో సమర్పించాననుకోవటము నా పసితనము.నీవు దానిని స్వీకరించాలి/స్వీకరించావు అనుకోవటము నా అమాయకత్వము.అయినప్పటికిని నీ ఆశ్రితవాత్సల్యము నన్ను నీ పదములకడ మంగళానుగ్రహముగా మారిపొమ్మని ప్రాధేయపదమంటున్నది.పరమేశా అర్పణ తో కాక ఆశ్రయభావముతో నిండిన నా మనసును స్వీకరించి నన్ను అనుగ్రహించు.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)