Posts

Showing posts from January, 2024

ADITYAHRDAYAM SLOKA-04

Image
  శ్లోకము-03  *********  "రామ రామమహాబాహో శృణు గుహ్యం సనాతనం   ఎన సర్వాన్ అరీన్ "వత్స" సమరేవిజయష్యసి"  పదవిభాగము  **********  వత్స-వాత్సల్య సంబోధనము.   అగస్త్యునిచే పలుకబడినది రాముని ఉద్దేశించి  రామ-ఓ అంతర్యామి  రామ-దశరథ నందన రామ   మహాబాహో.  అజానుబాహో-స్వరూపము  మహాబాహో-సామర్థ్యము   ఇప్పుడు స్తోత్రఫలితము చెప్పబడుతోంది.   ఎందుకంటే "ఆదిత్యహృదయ స్తోత్రము"  గుహ్యత-సనాతనత అను రెండు శుభలక్షణములను కలిగియున్నది.  శృణు-దీనిని విని-ఆచరిస్తే  సర్వాన్+అరీన్-సర్వశత్రువులను   బాహ్య శత్రువులను-అంతః శత్రువులను,   రావణాసురుడు-బాహ్యశత్రువు   చింత-శోకమును కలిగించు అంతః శత్రువు  వీటిమధ్యన జరుగుచున్న సమరములో  సమరే విజయష్యసి-నీవు విజయమును పొందెదవు.  ఈ శ్లోకమును స్తోత్ర ఫలశృతిగా పెద్దలు భావిస్తారు.   విశేషపదములు   ***********  వత్స-ఆవుదూడ    ఆవు శాఖాహారి అయినప్పటికిని తన సంతతిమీదిప్రేమతో దాని మాయను నాకితీసివేస్తుంది.తపోసంపన్నుడైన అగస్త్య మహాముని సైతము "మంత్రోపదేశము" రా...

ADITYAHRDAYAM-02

Image
  శ్లోకము-02  ********  " దైవతైశ్చ సమాగమ్య "ద్రష్టుం" అభ్యాగతో రణం   ఉపగమ్యాబ్ర విద్రామ అగస్త్యో "భగవాన్-ఋషిః"   పద విభాగము   ***********  రణం-ద్రష్టుం-యుద్ధమును వీక్షించుటకు  దైవతైశ్చ్య-సమాగమ్య-దేవతలతో సహా  భగవాం-ఋషి-విశేషపదములు  అగస్త్యో-అగస్త్యమహాముని  గమ్యా-రణస్థలికి వచ్చెను.  విదామ-ఉపగమ్యబ్ర-తాను ఒక్కడే రామునికి దగ్గరగా వెళ్ళెను.  భావము  ******  భగవానుడు-ఋషి అయిన అగస్త్యుడు దేవతలతో కలిసి యుద్ధమును వీక్షించుతకు వచ్చి,తానొక్కడు మాత్రమే రామునికి అతిదగ్గరగా వెళ్ళెను.(కర్తవ్యబోధనమునకై)   ఇప్పుడు విశేష శబ్దములను ప్రస్తావించుకుందాము.  కథనము ప్రకారము అగస్త్యభగవానుడు దేవతాసక్తులతో యుద్ధమును వీక్షించుటకు వచ్చి,తానొక్కడే రాముని సమీపించినాడు.అనగా ఇది అత్యంత గోప్యము.వాల్మికి మహర్షి అగస్త్యునకు భగవాన్-ఋషి అను రెండు విశేష గుణములను ప్రస్తావించినాడు.కనుకనే "ద్రష్టుం" అన్న పదమును అగస్త్యునకు అన్వయిస్తే యుద్ధము-దాని పరిణామములను ముందే దర్శించగలిగిన మహాజ్ఞాని.  విష్ణు పురానములోనిర్వచించినట్లు,  "ఉత్పత్తి-ప్రళ...

TIRUPPAVAI-PASURAM-30

TIRUPPAAVAI-29 PASURAM

Image
  శాత్తుమరై పాశురము-29 ****************** "ఆలకించనీయననదు నీ అనురాగపు ఆంతర్యము ఆలసించగనీయదు అనుమతింప నిత్యకైంకర్యము" మంగళప్రదమైన పాశురములో ఇష్టప్రాప్తి-అనిష్ట నిర్మూలనము ను స్పష్టము చేయించి ఇటు ఏడుతరములను-అటుఏడు తరములను స్వామి అనుగ్రహప్రాప్తులను (మన పూర్వీకులను-ఉత్తర వంశస్థులను) ఉద్ధరించుటయే కాక,రంగనాధుని అనుగ్రహమును పొంది-కొత్త పెళ్ళికూతురుగా ముస్తాబవబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,వారనుగ్రహించనంతమేరకు (వింజామర) పాశురమును అనుసంధానము చేసుకునేందుకు ప్రయత్నమును చేద్దాము. ఇరువది తొమ్మిదవ పాశురం ********************** శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్ పెత్తం మేయ్ తుణ్ణం కులత్తిల్ పిరందు నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వోం మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్. గోపికలు ప్రథమ పాశురము నుండి స్వామి పఱ ను తమకు అనుగ్రహిస్తాడని-దానిని స్వీకరించి నోమును నోచుకుందామని ప్రతిపాశురములో చెబుతున్నారు. ఒక్కొక్క ...

TIRUPAVAI-PASURAM-28

Image
  పాశురము-28 తిరుపావై-పాశురము-28 ******************* " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థం స్వశతశిరస్సిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమైద మివం భూయ ఏ వాస్తు భూయః". ప్రస్తుతా ప్రాభవ పాశురములో గోదమ్మ, "జ్ఞానత్రయముపాదేయం-యత్ అన్యత్ నకించన" అన్న సూక్తిని గోపిక-స్వామి సంభాషణము ద్వారా సంకీర్తిస్తున్నది. ఉత్పత్తి-నాశము-ప్రాప్తి-వికృతి-సంస్కారము అను ఐదు లక్షణములను కలిగిన కర్మ చేతనునికి అజ్ఞానమును తొలగింపచేసి ఆత్మజ్ఞానమును కలిగించలేనిది. ఆ కర్మము యొక్క రహస్యమును చేతనునికి తెలియచేయునది కేవలము జ్ఞానము మాత్రమే. ఆ జ్ఞానము మూడు మెట్లగా మారి చేతనునికి, స్వజ్ఞానము ప్రాప్తజ్ఞానము ప్రాపకజ్ఞానము అను ముఖ్య విభాగములై , నాదిఈ ఉపాధి- సమయపాలనము నా ఉపాధి లక్షణము స్వధర్మాచరణమే నా ఉపాధి ధ్యేయము అను మూడు మెట్లనెక్కిన తరువాత, ఏ వస్తువునైనను స్వరూప స్వభావములను తగిలించక సహజస్థితిని గుర్తించే సక్తిని పొందుతుంది. ఆ ప్రయానములో తాను తగిలించుకొని వచ్చిన జన్మసంస్కారములను నిర్వహిస్తూనే వానిని భగవత్ కైంకర్యముగా భ...

TIRUPPAAVAI-27

Image
    తిరుప్పావై-పాశురం-27   ****************  " " నీళాతుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం    పారార్థ స్వశృతిశత స్సిద్ధముద్యాపయంతే    స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాం బలాత్ కృత్యభుంగ్తే    గోదా తస్యై నమ ఇద మివం భూయ యే వాస్తు భూయః"   పూర్వ పాశుర ప్రస్తావనము   ***********************     స్వామికి గోపికలపై -గోపికలకు స్వామిపై నున్న వాత్సల్యమును మణిమయ స్వరూపకాంతిగాకీర్తించుచున్నది గోదమ్మ. .   ప్రళయసమయములో బ్రహ్మాండములను తనఉదరములో దాచుకొని,వటపత్ర సాయిగా మార్కండేయునిచే కీర్తించబడిన స్వామి సామర్థ్యమును సంస్తుతించినది.   అన్నిటికన్నా ముఖ్యమైన విషయము గోపికలు నోమునకు కావలిసిన వస్తువులను అడుగుతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికిని స్వామి వైకుంఠముతోసహా  తరలి విచ్చేయమని విన్నవించుకొనుట.   గోదమ్మ ఈ పాశురములో అంతః-బహిః యాగములను గోపికలు స్వామిని అర్థించుఆరు విశేషములలో నిక్షిప్తపరచినది.  1 శంఖ ప్రణవనాదము-మంత్రాసనము (స్వామికి)  2,పఱ వాయిద్య ఘోష-తిరుమంజనము  3.పల్లాండు-అలంకరణము-మంత్రపుష్పము  4.దీపము...

TIRUPPAAVAI-PAASURAMU-26

Image
  ఇరువది ఆరవ పాశురంతిరుప్పావై-పాశురము-26 ***************** " నీళాతుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ స్వశృతిశత స్సిద్ధముద్యాపయంతే స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాం బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇద మివం భూయ యే వాస్తు భూయః" పూర్వ పాశుర ప్రస్తావనము *********************** గోపికలావతార జ్ఞానమును స్వామి గుణానుభవమునకు మార్గముగా చూపించినగోదమ్మ, ప్రస్తుత పాశుర ప్రాభవము *********************** స్వామికి గోపికలై-గోపికలకు స్వామిపై నున్న వాత్సల్యమును మణిమయ స్వరూపకాంతిగాకీర్తించుచున్నాడీ. ప్రళయసమయములో బ్రహ్మాండములను తనౌదరములో దాచుకొని,వటపత్ర సాయిగా మార్కండేయునిచే కీర్తించబడిన స్వామి సామర్థ్యమును సంస్తుతించినది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము గోపికలు నోనకు కావలిసిన వస్తువులను అడుగుతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికిని స్వామి వైకుంఠముతో తరలి విచ్చేయమని విన్నవించుకొనుట. గోదమ్మ ఈ పాశురములో అంతః-బహిః యాగములను గోపికలు స్వామిని అర్థించుఆరు విశేషములలో నిక్షిప్తపరచినది. 1 శంఖ ప్రణవనాదము-మంత్రాసనము (స్వామికి) 2,పఱ వాయిద్య ఘోష-తిరుమంజనము 3.పల్లాండు-అలంకరణము-మంత్ర...

TURUPPAAVAI-PAASURAM-25

Image
  1.పరమాత్మతన విభూతిగా తాను సృజించిన సంసారమనే సాగర్ములో తిరుగాడుచున్న మత్స్యము.దానికికారణము సోమకుడు అను తమో-రజో గుణములు,వేదములు అనే జ్ఞానమును/సత్వగుణమును దాచివేసి,రజో-తమో ప్రవృత్తులను అధికముచేయుటయే.  2.తాను సృజించిన/తన విభూతి యైన సంసారమను పెద్ద కొండను మునగకుండా చేయుటకై,తమో-రజో గుణముల నుండి సత్వమును సంరక్షించుటకై సిద్ధపడిన సత్యస్వరూపమే కూర్మము.కల్పవృక్షము-కామధేనువు,ఐరావతము,తెల్లగుర్రము ఇలా ఎన్నో ప్రలోభములు పక్కదారిపట్టిస్తున్నప్పటికిని అమృతమే గమ్యము కనుక దానిమర్మమును చెప్పునదియే కూర్మము.  3.భూసంరక్షణమే/ఉపాధి సంరక్షణమే,"శరీరమాద్యంఖలు ధర్మసాధనం"కనుక పరమపద పథమును సూచించు ఉపాధి సంరక్షణమే వరాహావతారము.  4.నరత్వము-సింహత్వము సగముసగముగా నున్నది నారసింహము.ఇప్పటివరకు ఉపాధికి దూరముగానున్న తమో-రజో గుణములు ఉపాధిలోనే ,సత్వము సగము తరలి వచ్చినను,కదలక-మెదలకనున్నవికనుక,  ఐహికమును/ఉపాధిని/తమో-రజో గ్య్ణములను హింసించి,నరత్వమును హింసించి,చైతన్యమును గమనించుటయే నారసింహము.  5.మనకు ఉన్నదనుకున్న జ్ఞానము వామనము/అసంపూర్ణము.దానిని త్రివిక్రమము చేసుకోవాలి.త్రిగుణములను జయించాలి అనిచెప్పేది ...